ఆర్థిక విధానాల దిశ మార్చండి
- బడ్జెట్ ముందు సంప్రదింపుల్లో ఆర్థిక మంత్రికి కార్మిక సంఘాల వినతి
కేవలం వ్యాపార, వాణిజ్య సంస్థలకు మాత్రమే కాక సామాన్యులు జీవించటానికి కూడా వెసులుబాటు కలిగేలా ఆర్థిక విధానాల దశ, దిశ మార్చాలని కేంద్ర కార్మిక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు 11 కేంద్ర కార్మిక సంఘాల నేతలు ప్రిబడ్జెట్ కన్సల్టేషన్ ప్రక్రియలో భాగంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి సోమవారం వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు కార్పొరేట్, బడా వ్యాపార వేత్తలకు అనుకూలంగానే వున్నాయి తప్ప సామాన్యులకు వీటి వల్ల ఒరిగిందేమీ లేదని ఈ కార్మిక సంఘాల నేతలు స్పష్టంచేశారు. ఇప్పుడు కేంద్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధానాలు పూర్తిగా కార్పొరేట్ అనుకూల వైఖరికి మారిపోవటంతో సామాన్యుల జీవన పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని,ఉపాధి కల్పన నానాటికీ తగ్గిపోవటమే కాక వేతనాలలలో కోతలు పెరుగుతున్నాయని, భారీ స్థాయిలో ఉద్యోగుల కాంట్రాక్టీకరణ జరుగుతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఈ నెల 6న ఆర్థిక మంత్రితో జరిగిన బడ్జెట్ ముందరి సంప్రదింపుల్లో సిఐటియు తరపున ప్రాతినిధ్యం వహించిన తపన్సేన్ కేంద్ర ఆర్థిక మంత్రికి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బడా కార్పొరేట్ సంస్థలు, భూ మాఫియాల ప్రయోజనాల కోసం బొగ్గు పరిశ్రమ జాతీయకరణ, భూసేకరణ వంటి చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఆర్డినెన్స్లు తెచ్చిందని తపన్సేన్ ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు.కార్మిక ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి కనీస వేతనం రు.15,000గా నిర్ణయించాలని, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, ఆశా, తదితర సామాజిక సంక్షేమ పథకాల వర్కర్లకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించే అంశాలపై భారత కార్మిక సదస్సులు ఏకాభిప్రాయంతో చేసిన సిఫార్సులను విస్మరించిందన్నారు. లక్షలాది మంది కార్మిక వర్గాలకు సంబంధించిన ఈ అంశాలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం 'సబ్కా సాథ్, సబ్కా వికాస్ ' అంటూ నినాదాలతో మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తోందని విమర్శించారు. గత రెండేళ్లలో ముఖ్యంగా గత ఎనిమిది నెలల ఎన్డీయే పాలనలో సంక్షేమ పథకాల వ్యయం గణనీయంగా తగ్గిపోవటంతో గ్రామీణ భారతంలో జీవన పరిస్థితులు గణనీయంగా దిగజారి పోయాయని సాక్షాత్తు ప్రభుత్వం ప్రచురించిన మధ్యంతర ఆర్థిక విశ్లేషణ వెల్లడిస్తోందని ఆయన తెలియజేశారు. వేతనాల తగ్గుదల కూడా ఇదేరీతిలో కొనసాగుతుందని ఈ పత్రం వెల్లడించిందని, దీనితో పాటు పట్టణ ప్రాంత వేతనాల స్థాయిని ఉత్పాదక వ్యయంలో 2.5 శాతం మించకుండా అణచివేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్డీయే సర్కారు కలలు కంటున్న సర్వతోముఖాభివృద్ధి కేవలం మంత్రి మీడియాలో ప్రజలను మోసగించేందుకు చెబుతున్న ఓటి మోతలా మిగిలిపోతుందని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల నిర్వీర్యం, సహజవనరుల దోపిడీ వంటి అంశాలతో కూడిన విధానాలను ప్రభుత్వం తక్షణమే మార్చుకోవాలని కార్మిక సంఘ నేతలు స్పష్టం చేశారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో సిఐటియు నేతలతో పాటు బిఎంఎస్కు చెందిన బ్రిజేష్ ఉపాధ్యారు, సురేంద్రన్, ఎఐటియుసికి చెందిన డిఎల్ సచ్దేవా, ఐఎన్టియుసికి చెందిన ఎస్కె జమా, ఎఐయుటియుసికి చెందిన ఆర్కె శర్మ, ఎల్పిఎఫ్కు చెందిన షణ్ముగన్, సేవాకు చెందిన మొనాలి, యుటియుసికి చెందిన అశోక్ ఘోష్, టియుసిసికి చెందిన ఎస్పి తివారీ, ఎఐసిసిటియుకి చెందిన సంతోష్ రారు, హెచ్ఎంఎస్కు చెందిన ఎస్డి త్యాగి తదితరులున్నారు.
ఒక శాతం చేతిలో సగానికిపైగా సంపద
- క్రెడిట్ సూస్సె నివేదిక
అపర కుబేరులు, బడా బూర్జువా రాజకీయ నాయకులు ఈ వారం స్విటర్లాండ్లోని దావోస్లో కొలువుతీరనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో 2016 సంవత్సరాంతానికి ప్రపంచ జనాభాలోని ఒక శాతం మందిగా వున్న ఈ అపరకుబేరుల సంపద మిగతా 99శాతంమంది దగ్గరున్న సంపదను మించి ఉండబోతున్నదనే వాస్తవాన్ని క్రెడిట్ సూస్సె నివేదిక వెల్లడించింది. ఏటా జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)కు ఇదొక సవాలు విసరబోతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చిన పాపం ఎవ్వరిదని కాస్తోకూస్తో ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు ప్రజలను దరిద్రులుగా మారుస్తూ మరోవైపు అదే పెట్టుబడిదారీ వ్యవస్థ దాతృత్వ సంస్థలను సృష్టించి వాటికి తాను సృష్టించిన దారిద్య్రాన్ని తగ్గించే బాధ్యతను అప్పగిస్తున్నది!
అలా పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన దాతృత్వ సంస్థలలో బాగా పేరున్న సంస్థ 'ఆక్స్ఫాం'. ప్రపంచంలోని సంపద తీరుతెన్నుల గురించి క్రెడిట్ సూస్సె వార్షికంగా ప్రచురించే 'గ్లోబల్ వెల్త్ రిపోర్ట్' పై ఆక్స్ఫాం స్పందనను సోమవారంనాడు ప్రచురించారు. ఈ అధ్యయనంలో తేలిందేమంటే, ప్రపంచ సంపదలో అగ్రభాగాన వున్న ఒక శాతం మంది పెట్టుబడిదారులు 2009లో ప్రపంచ సంపదలో 44శాతం వాటా కలిగివుండగా 2014 నాటికి అది 48శాతానికి పెరిగింది. అట్టడుగున వున్న 80శాతం మంది ప్రజలకు దక్కిన వాటా కేవలం 5.5 శాతం మాత్రమే. ఈ ధోరణి ఇలానే కొనసాగితే 2016కల్లా ప్రపంచ సంపదలో అత్యంత ధనికులైన పె ఒక శాతం మంది వాటా 50శాతాన్ని మించుతుంది.
2008-09లో వచ్చిన ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచంలో సంపద కేంద్రీకరణ పెరిగిందని, దీన్ని తిరోగమింపజేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఆక్స్ఫాం ఇంటర్నేషనల్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బ్యాన్హిమా పేర్కొంది. ఈ సంవత్సర ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన ఆరుగురు సహ అధ్యక్షులలో ఈమె ఒకరు. 'ప్రపంచంలో అత్యంత ధనికుల, అత్యంత శక్తివంతులైన రాజకీయ నాయకుల వేదికైన ప్రపంచ ఆర్థిక వేదికకు ప్రపంచంలోని నిరుపేద దేశాలలో జీవిస్తున్న ప్రజల సందేశాన్ని మేము చేరవేయాలనుకుంటున్నాం... ఈ సందేశమేమంటే: పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ప్రమాదకరం. ఇది వృద్ధికి, పరిపాలనకు మంచిదికాదు. సంపద కేంద్రీకరణతో అధికారం చేజిక్కించుకుని సామాన్య ప్రజానీకం నోరు పెగలనీయటం లేదు. వారి ప్రయోజనాలు గాలికి వదిలివేయబడుతున్నాయి' అని ఆమె ప్రకటించారు.
ప్రపంచంలో 50శాతంగా ఉన్న 350కోట్ల పేదల ఆస్తి కేవలం 85మంది అత్యంత ధనికుల సంపదతో సమానంగా ఉన్నదని గత సంవత్సరం దావోస్లో ఆక్స్ఫాం చేసిన ప్రకటన ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ తారతమ్యం మరింతగా పెరిగి 80మంది ధనికుల సంపదకు సమానమైంది. ఈ సంఖ్య 2010లో 388గా ఉండేది. కేవలం 1శాతం మంది సంపద, మిగిలిన 99శాతం ప్రజల చేతిలో వున్నదానికన్నా ఎక్కువ ఉన్న ప్రపంచంలోనా మనం జీవించేది? ఎవరెన్ని హెచ్చరికలు చేసినా 'పెట్టుబడి' తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ఈ ప్రమాదం గురించి హెచ్చరించిన వారిలో పోప్ ఫ్రాన్సిస్ కూడా ఉన్నాడు. సంపద కేంద్రీకరణ 19వ శతాబ్దం స్థాయికి దిగజారుతున్నదని లక్షలాది ప్రతులు అమ్ముడైన థామస్ పికెట్టి గ్రంథం '21శతాబ్దంలో పెట్టుబడి' చెబుతున్నది.క్రెడిట్ సూస్సె నివేదిక నుంచి ఆక్స్ఫాం తేల్చిన విషయాలు ఇలా ఉన్నాయి: 2009-2014 మధ్య 80మంది అపర కుబేరుల సంపద రెట్టింపయింది.'ఫోర్బెస్' పత్రిక ప్రకటించిన 1645మంది శత కోటీశ్వరుల సంపద దాదాపు వారసత్వంగా సంక్రమించిందే. వీరిలో 20 శాతం మందికి ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలలో పెట్టుబడులున్నాయి. 2014 మార్చికి ముందు 12నెలల కాలంలో వీరి సంపద 11శాతం పెరిగింది.అంతర్జాతీయ ఓడల అనుమతిపై నిరసన
- బోట్లు నిలిపివేసిన మత్స్యకారులు
ప్రజాశక్తి - యానాం
భారత జలాల్లోకి అంతర్జాతీయ ఓడలను స్వేచ్ఛగా అనుమతించాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ యానాం మత్స్యకారులు సోమవారం బోట్లు నిలిపివేశారు. ఈ సందర్భంగా రఘువంశీ మెకనైజ్డ్ అండ్ గిన్లెట్ ఫిషింగ్ బోట్ల అధ్యక్షుడు చింతా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గతంలో విదేశీ బోట్ల వేటకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న యుపిఎ ప్రభుత్వం మత్స్యకారుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. ఇప్పుడు బిజెపి ప్రభుత్వమూ అదేబాటలో పయనిస్తోందన్నారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్తంగా మత్స్యకారులంతా ఐక్యమై తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సంఘం కార్యదర్శి పెమ్మాడి అప్పారావు, సహాయ కార్యదర్శి ప్రసంగి శ్రీను, ఉపాధ్యక్షుడు దోమ సత్యం, సభ్యులు మేడా భైరవ స్వామి, మల్లాడి ధర్మారావు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కు యానాం ఎంఎల్ఎ మల్లాడి కృష్ణారావు ద్వారా వినతిపత్రం అందించారు.
Posted on: Mon 19 Jan 23:35:33.056057 2015
కేవలం వ్యాపార, వాణిజ్య సంస్థలకు మాత్రమే కాక సామాన్యులు జీవించటానికి కూడా వెసులుబాటు కలిగేలా ఆర్థిక విధానాల దశ, దిశ మార్చాలని కేంద్ర కార్మిక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు 11 కేంద్ర కార్మిక సంఘాల నేతలు ప్రిబడ్జెట్ కన్సల్టేషన్ ప్రక్రియలో భాగంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి సోమవారం వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు కార్పొరేట్, బడా వ్యాపార వేత్తలకు అనుకూలంగానే వున్నాయి తప్ప సామాన్యులకు వీటి వల్ల ఒరిగిందేమీ లేదని ఈ కార్మిక సంఘాల నేతలు స్పష్టంచేశారు. ఇప్పుడు కేంద్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధానాలు పూర్తిగా కార్పొరేట్ అనుకూల వైఖరికి మారిపోవటంతో సామాన్యుల జీవన పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని,ఉపాధి కల్పన నానాటికీ తగ్గిపోవటమే కాక వేతనాలలలో కోతలు పెరుగుతున్నాయని, భారీ స్థాయిలో ఉద్యోగుల కాంట్రాక్టీకరణ జరుగుతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఈ నెల 6న ఆర్థిక మంత్రితో జరిగిన బడ్జెట్ ముందరి సంప్రదింపుల్లో సిఐటియు తరపున ప్రాతినిధ్యం వహించిన తపన్సేన్ కేంద్ర ఆర్థిక మంత్రికి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బడా కార్పొరేట్ సంస్థలు, భూ మాఫియాల ప్రయోజనాల కోసం బొగ్గు పరిశ్రమ జాతీయకరణ, భూసేకరణ వంటి చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఆర్డినెన్స్లు తెచ్చిందని తపన్సేన్ ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు.కార్మిక ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి కనీస వేతనం రు.15,000గా నిర్ణయించాలని, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, ఆశా, తదితర సామాజిక సంక్షేమ పథకాల వర్కర్లకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించే అంశాలపై భారత కార్మిక సదస్సులు ఏకాభిప్రాయంతో చేసిన సిఫార్సులను విస్మరించిందన్నారు. లక్షలాది మంది కార్మిక వర్గాలకు సంబంధించిన ఈ అంశాలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం 'సబ్కా సాథ్, సబ్కా వికాస్ ' అంటూ నినాదాలతో మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తోందని విమర్శించారు. గత రెండేళ్లలో ముఖ్యంగా గత ఎనిమిది నెలల ఎన్డీయే పాలనలో సంక్షేమ పథకాల వ్యయం గణనీయంగా తగ్గిపోవటంతో గ్రామీణ భారతంలో జీవన పరిస్థితులు గణనీయంగా దిగజారి పోయాయని సాక్షాత్తు ప్రభుత్వం ప్రచురించిన మధ్యంతర ఆర్థిక విశ్లేషణ వెల్లడిస్తోందని ఆయన తెలియజేశారు. వేతనాల తగ్గుదల కూడా ఇదేరీతిలో కొనసాగుతుందని ఈ పత్రం వెల్లడించిందని, దీనితో పాటు పట్టణ ప్రాంత వేతనాల స్థాయిని ఉత్పాదక వ్యయంలో 2.5 శాతం మించకుండా అణచివేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్డీయే సర్కారు కలలు కంటున్న సర్వతోముఖాభివృద్ధి కేవలం మంత్రి మీడియాలో ప్రజలను మోసగించేందుకు చెబుతున్న ఓటి మోతలా మిగిలిపోతుందని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల నిర్వీర్యం, సహజవనరుల దోపిడీ వంటి అంశాలతో కూడిన విధానాలను ప్రభుత్వం తక్షణమే మార్చుకోవాలని కార్మిక సంఘ నేతలు స్పష్టం చేశారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో సిఐటియు నేతలతో పాటు బిఎంఎస్కు చెందిన బ్రిజేష్ ఉపాధ్యారు, సురేంద్రన్, ఎఐటియుసికి చెందిన డిఎల్ సచ్దేవా, ఐఎన్టియుసికి చెందిన ఎస్కె జమా, ఎఐయుటియుసికి చెందిన ఆర్కె శర్మ, ఎల్పిఎఫ్కు చెందిన షణ్ముగన్, సేవాకు చెందిన మొనాలి, యుటియుసికి చెందిన అశోక్ ఘోష్, టియుసిసికి చెందిన ఎస్పి తివారీ, ఎఐసిసిటియుకి చెందిన సంతోష్ రారు, హెచ్ఎంఎస్కు చెందిన ఎస్డి త్యాగి తదితరులున్నారు.
ఒక శాతం చేతిలో సగానికిపైగా సంపద
Posted on: Mon 19 Jan 23:32:49.186365 2015
అపర కుబేరులు, బడా బూర్జువా రాజకీయ నాయకులు ఈ వారం స్విటర్లాండ్లోని దావోస్లో కొలువుతీరనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో 2016 సంవత్సరాంతానికి ప్రపంచ జనాభాలోని ఒక శాతం మందిగా వున్న ఈ అపరకుబేరుల సంపద మిగతా 99శాతంమంది దగ్గరున్న సంపదను మించి ఉండబోతున్నదనే వాస్తవాన్ని క్రెడిట్ సూస్సె నివేదిక వెల్లడించింది. ఏటా జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)కు ఇదొక సవాలు విసరబోతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చిన పాపం ఎవ్వరిదని కాస్తోకూస్తో ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు ప్రజలను దరిద్రులుగా మారుస్తూ మరోవైపు అదే పెట్టుబడిదారీ వ్యవస్థ దాతృత్వ సంస్థలను సృష్టించి వాటికి తాను సృష్టించిన దారిద్య్రాన్ని తగ్గించే బాధ్యతను అప్పగిస్తున్నది!
అలా పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన దాతృత్వ సంస్థలలో బాగా పేరున్న సంస్థ 'ఆక్స్ఫాం'. ప్రపంచంలోని సంపద తీరుతెన్నుల గురించి క్రెడిట్ సూస్సె వార్షికంగా ప్రచురించే 'గ్లోబల్ వెల్త్ రిపోర్ట్' పై ఆక్స్ఫాం స్పందనను సోమవారంనాడు ప్రచురించారు. ఈ అధ్యయనంలో తేలిందేమంటే, ప్రపంచ సంపదలో అగ్రభాగాన వున్న ఒక శాతం మంది పెట్టుబడిదారులు 2009లో ప్రపంచ సంపదలో 44శాతం వాటా కలిగివుండగా 2014 నాటికి అది 48శాతానికి పెరిగింది. అట్టడుగున వున్న 80శాతం మంది ప్రజలకు దక్కిన వాటా కేవలం 5.5 శాతం మాత్రమే. ఈ ధోరణి ఇలానే కొనసాగితే 2016కల్లా ప్రపంచ సంపదలో అత్యంత ధనికులైన పె ఒక శాతం మంది వాటా 50శాతాన్ని మించుతుంది.
2008-09లో వచ్చిన ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచంలో సంపద కేంద్రీకరణ పెరిగిందని, దీన్ని తిరోగమింపజేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఆక్స్ఫాం ఇంటర్నేషనల్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బ్యాన్హిమా పేర్కొంది. ఈ సంవత్సర ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన ఆరుగురు సహ అధ్యక్షులలో ఈమె ఒకరు. 'ప్రపంచంలో అత్యంత ధనికుల, అత్యంత శక్తివంతులైన రాజకీయ నాయకుల వేదికైన ప్రపంచ ఆర్థిక వేదికకు ప్రపంచంలోని నిరుపేద దేశాలలో జీవిస్తున్న ప్రజల సందేశాన్ని మేము చేరవేయాలనుకుంటున్నాం... ఈ సందేశమేమంటే: పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ప్రమాదకరం. ఇది వృద్ధికి, పరిపాలనకు మంచిదికాదు. సంపద కేంద్రీకరణతో అధికారం చేజిక్కించుకుని సామాన్య ప్రజానీకం నోరు పెగలనీయటం లేదు. వారి ప్రయోజనాలు గాలికి వదిలివేయబడుతున్నాయి' అని ఆమె ప్రకటించారు.
ప్రపంచంలో 50శాతంగా ఉన్న 350కోట్ల పేదల ఆస్తి కేవలం 85మంది అత్యంత ధనికుల సంపదతో సమానంగా ఉన్నదని గత సంవత్సరం దావోస్లో ఆక్స్ఫాం చేసిన ప్రకటన ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ తారతమ్యం మరింతగా పెరిగి 80మంది ధనికుల సంపదకు సమానమైంది. ఈ సంఖ్య 2010లో 388గా ఉండేది. కేవలం 1శాతం మంది సంపద, మిగిలిన 99శాతం ప్రజల చేతిలో వున్నదానికన్నా ఎక్కువ ఉన్న ప్రపంచంలోనా మనం జీవించేది? ఎవరెన్ని హెచ్చరికలు చేసినా 'పెట్టుబడి' తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ఈ ప్రమాదం గురించి హెచ్చరించిన వారిలో పోప్ ఫ్రాన్సిస్ కూడా ఉన్నాడు. సంపద కేంద్రీకరణ 19వ శతాబ్దం స్థాయికి దిగజారుతున్నదని లక్షలాది ప్రతులు అమ్ముడైన థామస్ పికెట్టి గ్రంథం '21శతాబ్దంలో పెట్టుబడి' చెబుతున్నది.క్రెడిట్ సూస్సె నివేదిక నుంచి ఆక్స్ఫాం తేల్చిన విషయాలు ఇలా ఉన్నాయి: 2009-2014 మధ్య 80మంది అపర కుబేరుల సంపద రెట్టింపయింది.'ఫోర్బెస్' పత్రిక ప్రకటించిన 1645మంది శత కోటీశ్వరుల సంపద దాదాపు వారసత్వంగా సంక్రమించిందే. వీరిలో 20 శాతం మందికి ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలలో పెట్టుబడులున్నాయి. 2014 మార్చికి ముందు 12నెలల కాలంలో వీరి సంపద 11శాతం పెరిగింది.అంతర్జాతీయ ఓడల అనుమతిపై నిరసన
Posted on: Mon 19 Jan 23:32:23.032614 2015
ప్రజాశక్తి - యానాం
భారత జలాల్లోకి అంతర్జాతీయ ఓడలను స్వేచ్ఛగా అనుమతించాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ యానాం మత్స్యకారులు సోమవారం బోట్లు నిలిపివేశారు. ఈ సందర్భంగా రఘువంశీ మెకనైజ్డ్ అండ్ గిన్లెట్ ఫిషింగ్ బోట్ల అధ్యక్షుడు చింతా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గతంలో విదేశీ బోట్ల వేటకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న యుపిఎ ప్రభుత్వం మత్స్యకారుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. ఇప్పుడు బిజెపి ప్రభుత్వమూ అదేబాటలో పయనిస్తోందన్నారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్తంగా మత్స్యకారులంతా ఐక్యమై తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సంఘం కార్యదర్శి పెమ్మాడి అప్పారావు, సహాయ కార్యదర్శి ప్రసంగి శ్రీను, ఉపాధ్యక్షుడు దోమ సత్యం, సభ్యులు మేడా భైరవ స్వామి, మల్లాడి ధర్మారావు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కు యానాం ఎంఎల్ఎ మల్లాడి కృష్ణారావు ద్వారా వినతిపత్రం అందించారు.
రెండు రూపాయలకు పైగా తగ్గిన పెట్రోల్, డీజిల్
న్యూఢిల్లీ:
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆరేళ్లలో కనిష్టానికి
పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి
తగ్గించింది. పెట్రోల్పై లీటరుకు రూ 2.42, డీజిల్ లీటరుకు రూ. 2.25 లను
తగ్గించింది. కాగా కొత్త ధరలు ఈ రోజు రాత్రి నుంచే అమలుల్లోకి వస్తున్నట్టు
చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ తగ్గింపుతో గత ఆగష్టునుంచి పెట్రోల్ ధర 9
సార్లు తగ్గగా, డీజిల్ ధర 5 సార్లు తగ్గింది. కొత్త రేట్ల ప్రకారం
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 58.91 తగ్గింది. గత 44 నెలల్లో ఇదే కనిష్ట
ధర. డీజిల్ ధర రూ.48.26కు తగ్గింది. 2013 ఏప్రిల్ తరువాత ఇదే అత్యల్పం. .
కాగా ధరలు తగ్గించిన కేంద్రం ఎక్సైజు సుంకాన్ని పెంచుతూ నిర్ణయం
తీసుకుంది. దానికారణంగా రెట్టింపు ధర తగ్గాల్సిఉండగా అందులో కేవలం సగం
మాత్రమే తగ్గింది.
గత నవంబరు నుంచి కేంద్రం నాలుగో ఏక్సైజు పెంపు చేసింది. పెట్రోల్పై రూ. 7.96, డీజిల్పై రూ. 8.95 లు ఎక్సైజు సుంకం పెంచుతూ ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని వలన ప్రభుత్వానిక ఆధనంగా 20 వేల కోట్లు ఆదాయం సమకూరనుంది. ఈ మొత్తం ప్రభుత్వ జిడిపిలో 4.1శాతం ఆర్థిక లోటును పూడుస్తుంది. కాగా ప్రభుత్వం చివరిసారిగా డిసెంబరు 16న పెట్రోల్ రేట్లు తగ్గించింది. గత జూన్లో అంతర్జాతీయంగా 115 డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు నేడు 46 డాలర్లుకి పడిపోవడం గమనార్హం.
Posted on: Sat 17 Jan 01:03:31.238228 2015
గత నవంబరు నుంచి కేంద్రం నాలుగో ఏక్సైజు పెంపు చేసింది. పెట్రోల్పై రూ. 7.96, డీజిల్పై రూ. 8.95 లు ఎక్సైజు సుంకం పెంచుతూ ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని వలన ప్రభుత్వానిక ఆధనంగా 20 వేల కోట్లు ఆదాయం సమకూరనుంది. ఈ మొత్తం ప్రభుత్వ జిడిపిలో 4.1శాతం ఆర్థిక లోటును పూడుస్తుంది. కాగా ప్రభుత్వం చివరిసారిగా డిసెంబరు 16న పెట్రోల్ రేట్లు తగ్గించింది. గత జూన్లో అంతర్జాతీయంగా 115 డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు నేడు 46 డాలర్లుకి పడిపోవడం గమనార్హం.
ఈ ఆర్థిక వ్యవస్థతో పేదలకు చేటు : పోప్
లాభార్జనే ప్రధాన ధ్యేయంగా వున్న ఈ ఆర్థిక వ్యవస్థ పేదలను నాశనం
చేస్తుందని ప్రోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. 'ఎకానమీ కిల్స్ 'అనే పేరుతో
ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. తాజాగా వాటికస్ విలేకర్లకు ఇచ్చిన ఒక
ఇంటర్వ్యూలో ఆయన దీనిపై మాట్లాడుతూ ప్రపంచ ద్రవ్య వ్యవస్థను తాను
విమర్శిస్తున్నానంటే కమ్యూనిజానికి మద్దతు ఇస్తున్నందువలన కాదు, పేదలకు సేవ
చేయాలని క్రీస్తు క్రైస్తవులకు పిలుపు ఇచ్చారు కనుక నేను అదే
చెబుతున్నాను. నేను దాని గురించి చెబుతుంటే నన్ను కమ్యూనిస్టు అంటున్నారు'
అని పోప్ అన్నారు. ఇటాలియన్ పత్రిక లా స్టాంపా విలేకర్లతో గత ఆదివారం
నాడు మాట్లాడారు. 'ఒకేసారి దేవుడు మరియు సంపద అనే ఇద్దరు యజమానులకు సేవ
చేయలేరని ఏసు స్పష్టం చేశారు. మత్తరు సువార్త చాప్టర్ 25లో 'నేను ఆకలితో
ఉన్నాను, నేను దాహంతో ఉన్నాను, నేను జైలులో ఉన్నాను, నేను జబ్బు పడ్డాను,
నా వంటిపై ఏమీలేదు, మీరు నాకు సాయం చేశారు, వస్త్రం ఇచ్చారు, నన్ను
పరామర్శించారు, నా సంరక్షణ చూశారు' అని ఉంది. దాని ప్రాతిపదికన మనం మంచి
చెడ్డలను నిర్ణయించాలి.' అని పోప్ చెప్పారు.'పేదలపై కేంద్రీకరించటం
సువార్తలో, చర్చి సాంప్రదాయంలో ఉంది, దాన్ని కమ్యూనిజం కనుగొనలేదు, చరిత్ర
క్రమంలో కొన్ని సార్లు జరుగుతున్నట్లుగా మనం దాన్ని సిద్దాంతీకరించనవసరం
లేదు. ప్రపంచీకరణ దారిద్య్రం నుంచి బయటపడటానికి అనేక మందికి సాయ పడింది,
కానీ ఇతరులనేక మందిని ఆకలితో మాడ్చే స్థాయికి నెట్టివేసింది, మొత్తంగా
చూస్తే ప్రపంచ సంపదలు పెరిగాయన్నది వాస్తవం, కానీ అసమానత కూడా పెరిగింది,
కొత్త రూపాలలో దారిద్య్రం ఆవిర్భవించింది. సామా జిక మరియు ఆర్థిక వ్యవస్థ
రూపొందించిన పనిముట్ల స్థాయికి స్త్రీ, పురుషులను దిగజా ర్చారు. ఇల్లులేని
ఇద్దరు వృద్దులు మరణిస్తే అది వార్త కాదు, అదే స్టాక్ మార్కెట్లో రెండు
పాయింట్లు నష్టపోతే మాత్రం పెద్ద వార్త ఎలా అవుతోంది. ఈ రోజు ప్రతిదీ పోటీ
సూత్రాలకిందకు, అందుకు తగిన వారే బతుకుతారంటున్నారు. బలహీనుల స్థానమెక్కడీ
పరిస్థితి ఇంకా చేయి దాటి పోలేదు, ప్రపంచ అసమానతలను మార్చేందుకు జనం
పూనుకోవాల్సి ఉంది' అని పలు అంశాలపై పోప్ చెప్పారు. ఒకవైపు పెట్టుబడిదారీ
ఆర్థిక వ్యవస్థ జనాన్ని చంపుతోందని పుస్తకం రాసిన సమయంలోనే వెనిజులాకు
చెందిన బిషప్పులు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థిస్తూ పత్రికలకు ఎక్కటం
గమనించాల్సిన అంశం. లాటిన్ అమెరికాలో పెట్టుబడిదారులు ప్రస్తుతం ముందుకు
తీసుకు వచ్చి అమలు జరుపుతున్న స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థ విధానాలకు
వ్యతిరేకంగా వెనిజులాతో సహా అనేక దేశాలలో వాటిని వ్యతిరేకించే వామపక్ష
శక్తులకు పట్టం కడుతున్న విషయం తెలిసిందే. బిజినెస్ డైలీ అనే పత్రికలో
వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించటం
కంటే వెనిజులాలో ఉన్న వామపక్ష ప్రభుత్వంపై ధ్వజమెత్తటం వారి లక్ష్యంగా
కనిపిస్తోంది. నయా ఉదారవాద విధానాలు చెప్పే ఊట సిద్ధాంతం ప్రకారం ఫలితాలు
పేదలకు చేరలేదని పోప్ ఫ్రాన్సిస్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
వెనిజులాలో నిత్యం ధరలు పెరుగుతున్నాయని, జనం సరకుల కోసం బార్లు తీరి
నిలబడాల్సి వస్తోందని దీనంతటికీ కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న సోషలిస్టు,
మార్క్సిస్టు లేదా కమ్యూనిస్టు రాజకీయ-ఆర్థిక వ్యవస్థ ఫలితమే అంటూ అది
వ్యక్తుల, సంస్థల స్వేచ్ఛ మరియు హక్కులను హరించే నియంతృత్వమని ఆరోపించారు.
దేశం బాగుండాలంటే ప్రయివేటు రంగం కీలక మంటూ బిషప్పుల ప్రతినిధి
మోనిసిగ్నోర్ డియిగో పాడ్రన్ పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో
కొన్ని సమస్యలున్న మాట నిజమే అంటూ సోషలిస్టు ప్రత్యామ్నాయ వ్యవస్థలో పేదలు
ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
- ఎంకెఆర్
ఐదేళ్లలో మరింత పెరగనున్న ప్రపంచ నిరుద్యోగం
- 2019నాటికి 21.2 కోట్ల మంది నిరుద్యోగులు
జెనీవా: వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అదనంగా 1కోటి 10 లక్షలమంది నిరుద్యోగులు పెరగనున్నారని ఐక్యరాజ్యసమితి మంగళవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందకొడిగా సాగడమే అందుకు కారణమని ఆ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలపై వెలువరించిన సంకలనంలో ఈ వివరాలు వెల్లడించింది. 2019నాటికి 21కోట్ల 20లక్షలమందికి పైగా నిరుద్యోగులు ఉంటారని ఈ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఈ సంఖ్య 20కోట్ల10లక్షలుగా ఉంది. 2014నాటికి 7కోట్ల 40లక్షలమంది 15-24 సంవత్సరాల మధ్య వయసున్న యువత ఉద్యోగాల వేటలో ఉన్నారని నివేదిక తెలిపింది. ఆర్థిక మాంద్య పరిస్థితులకు ముందు 2008లో ఉన్న నిరుద్యోగుల కంటే 3కోట్ల 10లక్షల మంది ఇప్పుడు పెరిగారని నివేదిక తెలిపింది. ఈ పరిణామంతో యువతులకు ఉద్యోగ అవకాశాలు మరింతగా తగ్గాయని పేర్కొంది.
సామాజిక న్యాయం, అంతర్జాతీయ మానవ, కార్మిక హక్కులపై పనిచేస్తున్న ఐరాస అనుబంధ సంస్థ ఐఎల్ఓ ఈ వివరాలను సంకలనం చేసింది. ఆదాయాల్లో ఉన్న అసమానతల కారణంగా ప్రపంచ ఆర్థికావ్యవస్థలో పెరుగుదల ఉద్యోగాల పెంపు సాధ్యం కావటం లేదని ఐఎల్ఓ డైరక్టర్ జనరల్ గై రైడర్ పేర్కొన్నారు.
Posted on: Sun 18 Jan 01:39:25.997309 2015
- ఎంకెఆర్
ఐదేళ్లలో మరింత పెరగనున్న ప్రపంచ నిరుద్యోగం
Posted on: Wed 21 Jan 23:33:00.540673 2015
జెనీవా: వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అదనంగా 1కోటి 10 లక్షలమంది నిరుద్యోగులు పెరగనున్నారని ఐక్యరాజ్యసమితి మంగళవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందకొడిగా సాగడమే అందుకు కారణమని ఆ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలపై వెలువరించిన సంకలనంలో ఈ వివరాలు వెల్లడించింది. 2019నాటికి 21కోట్ల 20లక్షలమందికి పైగా నిరుద్యోగులు ఉంటారని ఈ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఈ సంఖ్య 20కోట్ల10లక్షలుగా ఉంది. 2014నాటికి 7కోట్ల 40లక్షలమంది 15-24 సంవత్సరాల మధ్య వయసున్న యువత ఉద్యోగాల వేటలో ఉన్నారని నివేదిక తెలిపింది. ఆర్థిక మాంద్య పరిస్థితులకు ముందు 2008లో ఉన్న నిరుద్యోగుల కంటే 3కోట్ల 10లక్షల మంది ఇప్పుడు పెరిగారని నివేదిక తెలిపింది. ఈ పరిణామంతో యువతులకు ఉద్యోగ అవకాశాలు మరింతగా తగ్గాయని పేర్కొంది.
సామాజిక న్యాయం, అంతర్జాతీయ మానవ, కార్మిక హక్కులపై పనిచేస్తున్న ఐరాస అనుబంధ సంస్థ ఐఎల్ఓ ఈ వివరాలను సంకలనం చేసింది. ఆదాయాల్లో ఉన్న అసమానతల కారణంగా ప్రపంచ ఆర్థికావ్యవస్థలో పెరుగుదల ఉద్యోగాల పెంపు సాధ్యం కావటం లేదని ఐఎల్ఓ డైరక్టర్ జనరల్ గై రైడర్ పేర్కొన్నారు.
పెట్రో సుంకాలతో ప్రజలపై భారాలా?
Posted on: Sun 18 Jan 02:10:55.650024 2015
ఇండియా న్యూస్నెట్వర్క్, న్యూఢిల్లీ
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నప్పటికీ ఆ ప్రయోజనాలు దేశ ప్రజలకు అందకుండా సుంకాల పెంపుదలతో కేంద్రం వాటిని కొల్లగొడుతున్నదని సిపిఐ(ఎం) విమర్శించింది. గత నవంబర్ నుండి వరుసగా నాలుగుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచి దాదాపు 20 వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ప్రభుత్వం ఖజానాకు మళ్లించిందని పార్టీ పొలిట్బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర 2014 జూన్ నుంచి ఇప్పటివరకు 55 శాతానికి పైగా తగ్గగా ఆ ప్రయోజనాలను ప్రజలకు ఎందుకు అందించటం లేదని పొలిట్బ్యూరో కేంద్రాన్ని నిలదీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేవలం కంటితుడుపు తగ్గింపుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోం దని విమర్శించింది. నియంత్రిత ధరల విధానాన్ని రద్దు చేశామని చెప్పిన ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు వాటికనుగుణంగా ఇక్కడ ధరలు ఎందుకు తగ్గించడం లేదని పొలిట్బ్యూరో ప్రశ్నించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినపుడు ఆ భారాన్ని ప్రజలపై మోపేందుకు ఎంత మాత్రం సంకోచిం చని ప్రభుత్వం ధరలు తగ్గినపుడు ఆ ప్రయోజనాలను ప్రజలకు అంద కుండా చేస్తూ కపట వైఖరి అవలంబిస్తోందని పొలిట్బ్యూరో తన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ సుంకాల పెంపుదలను పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. ముడి చమురు ధర తగ్గుదల ప్రయోజనాలను పూర్తిగా ప్రజలకు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పార్టీ డిమాండ్ చేసింది. పేద, మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేయటానికి బదులు కార్పొరేట్ సంస్థలకు అందచేస్తున్న కోట్లాది రూపాయల భారీ రాయితీలకు తెరదించితే తన ఖజానా లోటు పూడ్చుకునే అవకాశం కేంద్రానికి లభిస్తుందని పొలిట్బ్యూరో వ్యాఖ్యానించింది. పెట్రో సుంకాల పెంపుదలపై నిరసన చర్యలు చేపట్టాలని పార్టీ శాఖలను పొలిట్బ్యూరో కోరింది.మెక్డొనాల్డ్ అమానవీయం
Posted on: Sun 18 Jan 01:52:19.968867 2015
- ఆన్లైన్లో వెల్లువెత్తిన నిరసన
- విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం
పూణే : వీధి బాలుడిని హోటల్ నుండి గెంటేసిన ఘటన శనివారం పూణేలోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లో జరిగింది. షహీనా అత్తర్వాలా అనే యువతి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.... షహీనా తన స్నేహితులతో రెస్టాంంట్కు వెళ్లింది. అక్కడ వారు కొనుక్కున్న ఆహార పదార్థాల వైపు దీన స్థితిలో ఉన్న ఒక వీధి బాలుడు చూస్తుండటంతో ఆమె అతన్ని లోపలికి తీసుకొచ్చి ఆ బాలుడికి ఇష్టమైనవి కొనుక్కోమని చెప్పింది. ఆ బాలుడు లైన్లో నిలుచోగా అంతలోనే హోటల్ పనిమనిషి ఆ బాలుడిని దురుసుగా పక్కకు నెట్టివేసి ఇలాంటి వీధి బాలలను లోపలికి రానివ్వమని చెప్పాడు. ఆ బాలుడు తనతోపాటే వచ్చాడని ఆమె చెప్పినా.. మరో ఉద్యోగి ఆ బాలుని కాలర్ పట్టుకుని బయటకు విసిరేశాడు, అలాంటి వారిని లోపలికి రానివ్వబోమనీ షహీనాకు రెస్టారెంట్ ఉద్యోగులు చెప్పారు. ఈ ఘటనపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నానన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు చెబుతానని తెలిపారు. కాగా మెక్ డొనాల్డ్ విడుదల చేసిన ప్రకటనలో తాము ఏ విచారణకూ సహకరించమనీ, తామే దీనిపై విచారణ జరుపుతామనీ తెలిపింది. తాము అన్ని వర్గాల వారిని సమాన గౌరవంతో చూస్తామనీ, ఎలాంటి వివక్షను చూపమనీ పేర్కొంది.
చార్లీ హెబ్డోనేనా? మురుగన్ను పట్టించుకోరా?
Posted on: Sun 18 Jan 00:57:18.180871 2015
రచయితకు మరణం లేదు
Posted on: Mon 19 Jan 23:31:35.593617 2015
రచయిత పెరుమాళ్ మురుగన్ కలం పట్టినందుకు, నిజం చెప్పినందుకు పంచాయతీ ఎదుర్కొన్నాడు. ఆయనను ఊర్లోంచి వెళ్ళగొట్టి మానసికంగా హింసించారు. ఫలితంగా తనలోని రచయితను తానే చంపుకొనేటట్లు చేశారు. తమిళనాడులో నామక్కల్ జిల్లాకు చెందిన పెరుమాళ్ మురుగన్ 2010లో 'మాతోరుబగన్' అనే పుస్తకం రాశారు. ఆ రాష్ట్రంలో ఒక ప్రముఖ కులానికి చెందిన ఒక పేద కుటుంబంలోని మహిళ సంతానం కోసం పరపురుషుడితో అక్రమంగా ఏడాదిలో ఒక రోజు గడపడం నవల ఇతివృత్తం. అలా గడపడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఆ మహిళకు పుట్టిన బిడ్డను సామిపిళ్లై (దేవుడి బిడ్డ)గా పిలుస్తారు. ఈ వాస్తవాన్ని మురుగన్ రాశారు. దీని ఇంగ్లీష్ అనువాదం వన్పార్ట్ ఉమెన్ ఇప్పుడు విడుదలైంది. దీనితో ప్రముఖ కులమైన గౌండర్లలో అలజడి మొదలైంది. కులం విషం చిమ్మింది. అమ్మకాలు బాగా పెరిగి నవలకు ప్రాచుర్యం లభించడంతో ఫాసిస్టులు పడగవిప్పారు. దాడులకు పూనుకున్నారు. మార్కెట్లో పుస్తకాలన్నీ వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేశారు. అమ్మకాలు ఆపివేయాల్సిందిగా ప్రచురణకర్తలకు ఆజ్ఞలు జారీచేశారు. ఇక తాను రాయబోయే రచనలు మరణించాయనీ చెప్పించారు. రాసినవి కూడా ప్రింట్ చేయనని, రద్దుచేసుకుంటున్నానని చెప్పించారు. అలా అతడు వెనక్కి వెళ్ళడానికి, రచయితగా మరణించడానికి ఎన్ని చిత్రహింసలు పెట్టివుంటారో... ఇదంతా తమిళనాడు ప్రభుత్వానికి తెలియదా? మురుగన్కు మద్దతుగా ఎందుకు నిలువలేదు. బావప్రకటన హక్కును ఎందుకు కాపాడలేదు. ఇది పాలకులు నిరంకుశ శక్తులకు వత్తాసుపలకడం కాదా! ఒత్తిడికిలోనై వ్యవహరించింది. కుల ఓట్ల రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడం కాదా? పైగా మురగన్కు వ్యతిరేకంగా నడిచిన నిరసనలను ప్రభుత్వ యంత్రాంగం ప్రోత్సహించింది. మురుగన్కు సమాన్లు జారీ చేసి వారిని సమర్థించింది. అందుకే కవులు కళాకారులు సరిగానే ప్రభుత్వాన్ని నిలదీశారు. ద్రావిడ ఉద్యమం నడచిన గడ్డలో ద్రావిడ నేతల గళం మూగబోయింది ఎందుకు. ఆలస్యంగానైనా డిఎంకె నేత స్టాలిన్ ఈ ఛాందసవాదుల దాడిని ఖండించడం ఆహ్వానించదగింది. ఇటువంటి దాడులు హిట్లర్, ముస్సోలినీల రాజ్యంలో సాధారణమే అయి వుండవచ్చు. ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నుండి కుల, మత ఫాసిస్టు శక్తులకు రెక్కలొచ్చాయి. పరమత సామరస్యానికి, సహజీవన భావనలను తుడిచేస్తున్నారు. బావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నారు. మురుగన్పై మానసికదాడిని వాక్స్వాతంత్య్రాన్ని అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛని ప్రేమించే వారంత ముక్తకంఠంతో వెలుగెత్తి ఖండించాల్సి ఉంది.
ఒక రచయితగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది. అందుకు మురుగన్ కలానికి సంకెళ్ళు వేయడం ఎంతవరకు సబబు. ఇదంతా సనాతన ఛాందసవాద శక్తులపనే. 'దేశంలో ఒక కవి ఉంటే మరో ప్రభుత్వమే ఉన్నట్లు' అన్న ఒక కవి మాటలకు అక్షరరూపం పెరుమాళ్ మురుగన్. ఆయన నిరసన దేశవ్యాప్త మైంది. కవిలోకం ఖండించింది. అక్షరం గర్జించింది. చరిత్రలో నిజం మాట్లాడిన ప్రతిసారీ నీతిమంతులు దాడులను ఎదుర్కొంటూనే ఉన్నారు. విశ్వవిఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ను ఛాందసవాదులు వదల్లేదు. నిజాన్ని వీధుల్లో నినదించినందుకే సప్ధర్ హష్మీని నడిరోడ్డుపై చంపారు. అశ్లీల సినిమాలు ఎన్ని వచ్చినా ఏమీ అనరు. పికె, విశ్వరూపం వంటి సినిమాలపై రాద్ధాంతం చేస్తారు. హత్యలు, ఆత్మహత్యలు ఎన్నో చూశాం. ఇప్పుడు భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ రచయిత రచయితగా ఆత్మహత్య చేసుకొనేదాకా ఈ దాడి పెరిగింది. తనలోని రచయిత మరణించాడని చెప్పడం ఒక విషాదకావ్యం. అది ఆత్మహత్య వాగ్మూలం. ఈ పరిణామాలను సభ్యసమాజం సహించరాదు. దీన్ని ఒక విడి ఘటనగా చూడలేము. రానున్న కాలంలో విస్తరించనున్న దురహంకార ధోరణులకు ఇది సంకేతం. అందుకే యావత్తు ప్రజలు ఖండించాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి