19, అక్టోబర్ 2011, బుధవారం

సకల జనుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసి, సింగరేణి తదితర సంస్థల ప్రైవేటీకరణ ప్రమాదం పొంచి ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. ' గతంలో చంద్రబాబు, వైఎస్‌ పలు సంస్థల ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని అమలు చేయలేకపోయారు. తాజా సమ్మె నేపథ్యంలో ఆ ప్రమాదం ముంచుకొచ్చింది. సమ్మె వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకునే పేరుతో, ఆర్టీసి, సింగరేణి సంస్థల్లో ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉంది. కార్మికుల మధ్య ప్రస్తుతమున్న అనైక్యతను యాజమాన్యాలు ఉపయోగించుకుంటాయి. కార్మికులు కూడా ప్రైవేటీకరణ వంటి ముఖ్యమైన సమస్యలపై కాకుండా, ఇతర సమస్యలపై ఆందోళనలు నిర్వహించడం...యాజమాన్యాలకు ఉపకరించే పరిణామం...' 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి