2, నవంబర్ 2012, శుక్రవారం


దీర్ఘకాలం జరిగిన రంగాలవారి సమ్మెలు చరిత్రలో ఉన్నాయి. బొంబాయి టెక్‌టైల్స్‌ సమ్మె ఆరేళ్ళపాటు జరిగింది. రాష్ట్ర ఉద్యోగుల సమ్మె 156 రోజుల పాటు సాగింది. కీలకమైన రైల్వే, ఎయిర్‌లైన్స్‌ సమ్మెలు జరిగాయి. ప్రభుత్వం ఈ సమ్మెలన్నింటిపట్ల వ్యవహరించినదానికీ, 1982 జనవరి 19న మొట్టమొదటి ఆలిండియా సమ్మె ఒక్కరోజు మాత్రమే జరిగినా దానిపై వ్యవహరించిన తీరులో తేడాను గమనించవచ్చు. 1981 జూన్‌ 4న జాతీయ కార్మిక సంఘాల సదస్సులో ఒక రోజు సమ్మె నిర్ణయం జరిగిన వెనువెంటనే జులై 27న అత్యవసర సర్వీసుల నిర్వహణ ఆర్డినెన్స్‌(ఇఎస్‌ఎంఓ) కేంద్రం తెచ్చి ఎదురుదాడి ప్రారంభించింది. అంతేకాదు సమ్మె సన్నాహక కార్యక్రమాలు దేశమంతటా జరిగే క్రమంలోనే సమ్మెను విఫలం చేయడానికి, భగం చేయడానికి యత్నాలు తన యంత్రాంగం ద్వారా చేసింది. ఒక ఆంధ్రప్రదేశ్‌లో మూడు వేల మందిని అరెస్టు చేసింది. సమ్మె చారిత్రకంగా అపూర్వమైంది. రైతుకు గిట్టుబాటు ధర, కార్మికులకు బోనస్‌ హక్కు, ధరలు, ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టీకరణ ప్రధాన డిమాండ్లు. విశేషమేమంటే నేటి ఫిబ్రవరి 28 సమ్మెలోనూ ఆ డిమాండ్లే ప్రధానంగా ఉన్నాయి. బోనస్‌ హక్కు స్థితివేరుగా ఉంది. నాడు ఐఎన్‌టియుసి సమ్మెలో లేదు. తర్వాత రాజ్యాంగంలో 310, 311(2)బి అధికరణలపై రాష్ట్ర ఉద్యోగుల ఒకరోజు జాతీయ సమ్మె పెద్దఎత్తున జరిగింది. 1986 ఫిబ్రవరి 26న ప్రధానిగా రాజీవ్‌ ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాలపై, ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించే యత్నాలకు వ్యతిరేకంగా, ధరల సూచిపై సీల్‌ కమిటీ సిఫార్సులపైనా, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుపై 1987 జనవరి 21న ఒక రోజు సమ్మె జరిగింది. ఐఎన్‌టియుసి పిలుపు చేరలేదు. దాని అనబంధ సంఘాలు అనేక చోట్ల పాల్గొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతనసవరణ ప్రక్రియల్లో బ్యూరోఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌(బిపిఇ) జోక్యానికి వ్యతిరేకంగానూ, కార్మిక చట్టాల్లో సవరణ తెచ్చి, వైద్య, విద్యా రంగాల్లో ట్రేడ్‌ యూనియన్‌ హక్కును నిరాకరించే యత్నాలకు వ్యతిరేకంగా 1988 మార్చి 15న జరిగిన ఒక్క రోజు సమ్మెలో ఐఎన్‌టియుసిలో దారావర్గం కలిసొచ్చింది. ఆ రోజున వామపక్షాలు బంద్‌ నిర్వహించి మద్దతుగా నిలిచాయి. మూసివేతలు, లాకౌట్లకు వ్యతిరేకంగానూ, భోఫోర్స్‌ అవినీతిలో దోషిగా ఉన్న రాజీవ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ, 1989 ఆగస్టు 30న కేంద్ర కార్మిక సంఘాలు, జులై 12న కమిటీ కలిసి సమ్మె నిర్వహించాయి. రాజీవ్‌ ఓటమి అనంతరం విపి.సింగ్‌ నాయకత్వంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలహీనంగా నడిచినా, పనిచేసే హక్కును ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్న డిమాండ్‌ను సూత్రప్రాయంగా అంగీకరించడం ప్రాధాన్యత కలిగిన అంశం.
సోవియట్‌ యూనియన్‌ పతనం, రాజీవ్‌ హత్య, అనంతరం జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పివి.నరశింహరావు ప్రభుత్వం తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాన్ని దివాలాదిశలో భ్రష్టుపట్టిన సంస్కరణలకు వ్యతిరేకంగా 1991-94 ఈ నాలుగు సంవత్సరాల్లో కేంద్ర కార్మిక సంఘాల స్పాన్సరింగ్‌ కమిటీ పిలుపుపై నాలుగు ఆలిండియా సమ్మెలు జరిగాయి. కాంగ్రెస్‌ అనుకూల ఐఎన్‌టియుసిగానీ, 1991-92 కాలంలో బాబ్రీ మషీదు పరిణామాల నేపథ్యంలో బిఎంఎస్‌గానీ ఈ సమ్మెల్లో పాల్గొనలేదు. అనంతర పరిస్థితుల్లో 56 ప్రజాసంఘాల జాతీయ వేదిక ఏర్పడింది. సరళీకృత ఆర్థిక విధానాలపై వ్యతిరేకత, మతసామరస్య పరిరక్షణ 

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం


ప్రజాస్వామ్యంలో బంద్‌లు, సమ్మెలు, సముచితమేనన్న సుప్రీంకోర్టు

Tue, 23 Mar 2010, IST    aa
ధనుంజయ మహాపాత్ర
ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మనోభావాలను వ్యక్తం చేసేందుకు 'బంద్‌' లన్నవి ఒక సాధనం అని సుప్రీంకోర్టు 2009 ఫిబ్రవరి 3న వెలువరించిన తీర్పులో పేర్కొంది.1997 నుండి న్యాయవ్యవస్థ అనుసరిస్తూ వచ్చిన వైఖరిని ఇది తిరగరాసింది. 1997లో బలవంతంగా మూసివేయడాలపై, వాటివల్ల ప్రజలకు వాటిల్లుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ రాజకీయపార్టీలపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది.
కొట్టొచ్చినట్లు కనబడే ఈ వైఖరిలో మార్పు మరింత స్పష్టంగా కనబడుతోంది. ఈ తాజా వైఖరిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌ అధ్యక్షతన గల ధర్మాసనం వివరించింది. 1997లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) కేరళ హైకోర్టు తీర్పులో భాగస్వామిగా ఉన్నారు. అది అప్పుడు బంద్‌లకు వ్యతిరేకంగా చారిత్రాత్మక తీర్పు నిచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. ఈ వైఖరిని అనుసరించేందుకు ఇతర హైకోర్టులకు మార్గదర్శకమైంది. బంద్‌లకు వ్యతిరేకంగా దాఖలైన ఒక పిటిషన్‌ను కోర్టు ఫిబ్రవరి 16న విచారణకు ఆదేశించింది. అయితే ఫిబ్రవరి 3న, సిజెఐ నేతృత్వంలో, న్యాయమూర్తులు పి.సదాశివం, జె.ఎం.పాంచాల్‌లతో కూడిన ధర్మాసనం ''ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడింది. బంద్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానం తీసుకున్న వైఖరితో ఎన్నడూ సమ్మతించని రాజకీయ పార్టీలు ఇప్పుడు తాజా వైఖరితో సంతృప్తిని ప్రకటిస్తున్నాయి. ఫిర్యాది జె.సంతోష్‌కుమార్‌ తరఫున హాజరైన అజిత్‌ పుదుస్సేరి, 1997 సుప్రీంకోర్టు తీర్పును ఉటంకించినపుడు ధర్మాసనంలో ఎటువంటి కదలికా కనబడలేదు.
వివిధ రాజకీయ పార్టీల ఛాత్ర సంస్థ అయిన ''శ్రీలంక తమిళుల రక్షణ ఉద్యమం'' బంద్‌ పిలుపు నిచ్చిందని, అది బంద్‌లకు వ్యతిరేకంగా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును, దానిని సమర్థించిన సర్వోన్నత న్యాయస్థాన తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని పుదుస్సేరి వాదించారు.
అయితే ఈ ధోరణి పనిచేయలేదు ''సమ్మెలను ఆపడంతో ఈ కోర్టుకేం పని? '' భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరికీ తమ భావాలను వ్యక్తీకరించుకొనే స్వేచ్ఛ ఉంద''ని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చుట్టూ తిరిగి మళ్ళీ మొదటికొచ్చింది. 1997లో ఇచ్చిన తీర్పులో హై కోర్టు ఇలా వ్యాఖ్యానించింది.
ఏదైనా పరిశ్రమను, లేదా వ్యాపారాన్ని ఏ రాష్ట్రంలోనైనా లేదా దేశంలో స్తంభింపచేసే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదా సంస్థకు ఉందని చెప్పే అవకాశం లేదు. తమ వైఖరి విభేదించే పౌరులను వారి ప్రాథమిక హక్కులను వినియోగించుకోకుండా, లేదా స్వప్రయోజనాలనిమిత్తం లేదా రాష్ట్ర లేదా దేశ ప్రయోజనాల నిమిత్తం వారి విధులను వారు నిర్వర్తించకుండా నిరోధించే హక్కు లేద''ని తేల్చిచెప్పింది.
''ఇలా చెప్పడం అనుచితం, ఒక రాజకీయ పార్టీ లేదా అందులోని సభ్యులుగాని చట్టబద్ధంగా వినియోగించుకోగల ఒక ప్రాథమిక హక్కుగా ఆమోదించలేము''.
ఈ తీర్పు పట్ల దేశ వ్యాపితంగా లక్షలసంఖ్యలో వున్న ప్రజలు తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

2012 ఫిబ్రవరి 28న కేంద్ర కార్మిక సంఘాలన్నీ సంయుక్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ స్థాయిలో జరిగే సమ్మెల్లో ఇది పద్నాలుగోవది. ఈ సమ్మెకు అనేక విధాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. భావసారూప్యతలో తేడాలున్నా ఐక్యంగా పోరాడాలన్న అవసరాన్ని గుర్తించడంలో జాతీయస్థాయి నాయకత్వాల పురోగమనం ఫలితంగా కార్మికుల్లో కనిపించే నూతనొత్తేజం, విశాల ఐక్యత ద్వారా సంఖ్యరీత్యా మరింత ఎక్కువ పాల్గొనే అవకాశం.. చూస్తుంటే ఫిబ్రవరి 28సమ్మె దేశ కార్మికవర్గ పోరాటాల చరిత్రలో ముందడుగుగా నిలుస్తుంది.
దీర్ఘకాలం జరిగిన రంగాలవారి సమ్మెలు చరిత్రలో ఉన్నాయి. బొంబాయి టెక్‌టైల్స్‌ సమ్మె ఆరేళ్ళపాటు జరిగింది. రాష్ట్ర ఉద్యోగుల సమ్మె 156 రోజుల పాటు సాగింది. కీలకమైన రైల్వే, ఎయిర్‌లైన్స్‌ సమ్మెలు జరిగాయి. ప్రభుత్వం ఈ సమ్మెలన్నింటిపట్ల వ్యవహరించినదానికీ, 1982 జనవరి 19న మొట్టమొదటి ఆలిండియా సమ్మె ఒక్కరోజు మాత్రమే జరిగినా దానిపై వ్యవహరించిన తీరులో తేడాను గమనించవచ్చు. 1981 జూన్‌ 4న జాతీయ కార్మిక సంఘాల సదస్సులో ఒక రోజు సమ్మె నిర్ణయం జరిగిన వెనువెంటనే జులై 27న అత్యవసర సర్వీసుల నిర్వహణ ఆర్డినెన్స్‌(ఇఎస్‌ఎంఓ) కేంద్రం తెచ్చి ఎదురుదాడి ప్రారంభించింది. అంతేకాదు సమ్మె సన్నాహక కార్యక్రమాలు దేశమంతటా జరిగే క్రమంలోనే సమ్మెను విఫలం చేయడానికి, భగం చేయడానికి యత్నాలు తన యంత్రాంగం ద్వారా చేసింది. ఒక ఆంధ్రప్రదేశ్‌లో మూడు వేల మందిని అరెస్టు చేసింది. సమ్మె చారిత్రకంగా అపూర్వమైంది. రైతుకు గిట్టుబాటు ధర, కార్మికులకు బోనస్‌ హక్కు, ధరలు, ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టీకరణ ప్రధాన డిమాండ్లు. విశేషమేమంటే నేటి ఫిబ్రవరి 28 సమ్మెలోనూ ఆ డిమాండ్లే ప్రధానంగా ఉన్నాయి. బోనస్‌ హక్కు స్థితివేరుగా ఉంది. నాడు ఐఎన్‌టియుసి సమ్మెలో లేదు. తర్వాత రాజ్యాంగంలో 310, 311(2)బి అధికరణలపై రాష్ట్ర ఉద్యోగుల ఒకరోజు జాతీయ సమ్మె పెద్దఎత్తున జరిగింది. 1986 ఫిబ్రవరి 26న ప్రధానిగా రాజీవ్‌ ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాలపై, ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించే యత్నాలకు వ్యతిరేకంగా, ధరల సూచిపై సీల్‌ కమిటీ సిఫార్సులపైనా, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుపై 1987 జనవరి 21న ఒక రోజు సమ్మె జరిగింది. ఐఎన్‌టియుసి పిలుపు చేరలేదు. దాని అనబంధ సంఘాలు అనేక చోట్ల పాల్గొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతనసవరణ ప్రక్రియల్లో బ్యూరోఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌(బిపిఇ) జోక్యానికి వ్యతిరేకంగానూ, కార్మిక చట్టాల్లో సవరణ తెచ్చి, వైద్య, విద్యా రంగాల్లో ట్రేడ్‌ యూనియన్‌ హక్కును నిరాకరించే యత్నాలకు వ్యతిరేకంగా 1988 మార్చి 15న జరిగిన ఒక్క రోజు సమ్మెలో ఐఎన్‌టియుసిలో దారావర్గం కలిసొచ్చింది. ఆ రోజున వామపక్షాలు బంద్‌ నిర్వహించి మద్దతుగా నిలిచాయి. మూసివేతలు, లాకౌట్లకు వ్యతిరేకంగానూ, భోఫోర్స్‌ అవినీతిలో దోషిగా ఉన్న రాజీవ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ, 1989 ఆగస్టు 30న కేంద్ర కార్మిక సంఘాలు, జులై 12న కమిటీ కలిసి సమ్మె నిర్వహించాయి. రాజీవ్‌ ఓటమి అనంతరం విపి.సింగ్‌ నాయకత్వంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలహీనంగా నడిచినా, పనిచేసే హక్కును ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్న డిమాండ్‌ను సూత్రప్రాయంగా అంగీకరించడం ప్రాధాన్యత కలిగిన అంశం.
సోవియట్‌ యూనియన్‌ పతనం, రాజీవ్‌ హత్య, అనంతరం జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పివి.నరశింహరావు ప్రభుత్వం తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాన్ని దివాలాదిశలో భ్రష్టుపట్టిన సంస్కరణలకు వ్యతిరేకంగా 1991-94 ఈ నాలుగు సంవత్సరాల్లో కేంద్ర కార్మిక సంఘాల స్పాన్సరింగ్‌ కమిటీ పిలుపుపై నాలుగు ఆలిండియా సమ్మెలు జరిగాయి. కాంగ్రెస్‌ అనుకూల ఐఎన్‌టియుసిగానీ, 1991-92 కాలంలో బాబ్రీ మషీదు పరిణామాల నేపథ్యంలో బిఎంఎస్‌గానీ ఈ సమ్మెల్లో పాల్గొనలేదు. అనంతర పరిస్థితుల్లో 56 ప్రజాసంఘాల జాతీయ వేదిక ఏర్పడింది. సరళీకృత ఆర్థిక విధానాలపై వ్యతిరేకత, మతసామరస్య పరిరక్షణ


సమ్మెలు, లాకౌట్ల వల్ల 50 లక్షల పనిదినాలు నష్టం

న్యూఢిల్లీ, మార్చి 17: దేశంలో గత సంవత్సరం సమ్మెలు, లాకౌట్ల వల్ల వివిధ సంస్థలలో 5 మిలియన్ల పనిదినాలు వృథా కాగా 61 యూనిట్లు మూతపడ్డాయి. సుమారు 2200 మంది కార్మికులు వీథిన పడ్డారని ఒక అధికారిక సమాచారం వెల్లడించింది. దేశంలోని ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గత సంవత్సరం కొన్ని పారిశ్రామిక వాడల్లో, ఇతర ఉత్పాదక కేంద్రాలలో సమ్మెలు, లాకౌట్ల వల్ల హెచ్చు పనిదినాలు నష్టపోయాయని లేబర్ బ్యూరో వెల్లడించింది. ఆర్థిక మాంద్యం నెలకొన్నా అంతకు ముందు సంవత్సరం కంటె గత సంవత్సరం ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య తక్కువగా ఉందని తెలియచేసింది. 2008లో 3,052 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోగా 2010 నాటికి ఈ సంఖ్య తగ్గింది. గత సంవత్సరం దేశంలో 61 యూనిట్లు మూతపడ్డాయి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 22 లక్షల పనిదినాలు నష్టమయ్యాయి. తర్వాత పశ్చిమబెంగాల్‌లో 10 లక్షలు, హిమాచల్ ప్రదేశ్‌లో 5 లక్షల పనిదినాలు నష్టపోయాయని ఆ నివేదిక వెల్లడించింది. కాగా అంతకు ముందు సంవత్సరం కంటె ఇది తక్కువేనని పేర్కొంది. ఇక ఒరిస్సాలో 1354 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 665 మంది, హర్యానాలో 95 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

31, జులై 2012, మంగళవారం

వాషింగ్టన్‌: అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందిన అమెరికాలో ప్రతి ఆరుగురులో ఒకరు పేదవారేనని వెల్లడైంది. అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిందనడానికి ఇది తాజా ఉదాహరణ. 2009లో దారిద్రరేఖకు దిగువవున్న వారి సంఖ్య 14.3 శాతం వుండగా, 2010లో ఇది 15.1 శాతంగా నమోదైందని సెన్సెస్‌ బ్యూరో వెల్లడించింది. 2009లో 43.6 మిలియన్ల మంది ఈ సంఖ్య 2010లో 46.2 మిలియన్లకు పెరిగిందని, వరుసగా నాలుగవ ఏట దేశంలో పేదవారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని 'ఆదాయం, దారిద్య్రం, ఆరోగ్యం, బీమా సౌకర్యం' అనే అంశాలపై సెన్సెస్‌ బ్యూరో అధ్యయనంచేసి రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం వార్షిక ఆదాయం 22,314 డాలర్లు(సుమారు రూ.10 లక్షలు), లేదా ఒక వ్యక్తి వార్షిక ఆదాయం11,319(సుమారు రూ.5లక్షలు) దాటనివారిని దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారిగా అమెరికా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఆరోగ్య బీమా లేనివారి సంఖ్య 49 మిలియన్ల నుంచి 49.9 మిలియన్లకు పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది. అమెరికా గత కొద్ది రోజులుగా ఆర్థికమాద్యం ఎదుర్కొంటుండగా, 2007 నుంచి పౌరుల ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నది. కాగా, 18 సంవత్సరాల వయస్సుకన్నా తక్కువవున్న పిల్లలలో దారిద్య్రం పెరుగుదల శాతం అధికంగా వుండటం గమనార్హం. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థికమాద్యం కారణంగానే
దేశంలో దారిద్య్రం పెరిగిపోతున్నదని నివేదిక స్పష్టం చేసింది. 1961, 1975, 1981, 1990 సంవత్సరాలలో దేశంలో ఆర్థికమాద్యం ఏర్పడినప్పటికీ కేవలం ఒక్క సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థ పుంజుకోగా, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా నాలుగు సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ పతనం కావడం నిపుణులను కలవరపరుస్తున్నది.
న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో ఓ అద్భుతం జరగబోతోంది. ప్రపంచ జనాభా 700కోట్లను దాటనుంది. ఈ 700కోట్లు పూర్తిచేసే శిశువు ప్రపంచంలోని ఏ దేశంలో జన్మిస్తుందో... అది ఆడో.. మగో తెలియకపోయినా కచ్చితంగా ఈ శతాబ్దంలో జరిగే ప్రపంచ అద్భుతాల్లో ఇదొకటిగా నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్ఫోటం వేగం తగ్గలేదు. గత రెండు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పథకాల్ని ప్రపంచ దేశాలు ఎంత సమర్ధమంతంగా అమలు చేస్తున్నా ఈ ఫలితాలింకా అందుబాటులోకి రాలేదు. కొన్ని వర్ధమాన దేశాలతోపాటు పేద దేశాలు కూడా జనాభా నియంత్రణలో వెనుకబడ్డాయి. అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న దేశాలు మాత్రమే జనాభా నియంత్రణలో కాస్త మెరుగైన ఫలితాలు సాధించాయి.
యుఎస్‌ సెన్సెస్‌ బ్యూరో ఇంటర్‌నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ సెంటర్‌ రూపొందించిన గణాంకాల మేరకు ప్రపంచంలో ప్రతివెయ్యిమంది జనాభాకు జనన రేటు 19గా ఉంటే మరణాల రేటు 8గా ఉంది. ప్రపంచంలో ప్రతినిమిషానికి 250మంది పుడుతుంటే 105 మంది మరణిస్తున్నారు. ప్రతిగంటకు 15వేల మంది పుడుతుంటే 6,316 మంది చనిపోతున్నారు. ప్రతిరోజు 3.60 లక్షల జననాలు, 1,51,600 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతిఏటా 13.13కోట్లమంది పుడుతున్నారు. 5.53కోట్లమంది మరణిస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచ జనాభా సగటు వయసు 67ఏళ్ళుగా లెక్కించారు. ప్రపంచ జనాభాలో 26శాతం 180కోట్లమంది 15ఏళ్ళ లోపు పిల్లలున్నారు. 66శాతం 440కోట్లమంది 15నుంచి 64ఏళ్ళ వయస్కులున్నారు. 8శాతం మంది 51.60కోట్లమంది 65ఏళ్ళకు పైబడ్డవారున్నారు.
2011 అక్టోబర్‌ మూడోవారంలోగా 700కోట్ల సంఖ్యను ప్రపంచ జనాభా దాటుతుందని ముందుగానే అంచనావేశారు. 1950నుంచి జనాభా వృద్ధి జోరు పెరిగింది. ఏటా 1.8శాతంగా ఇది నమోదైంది. 1970వరకు కూడా ఈ వేగం సాగింది. 1963లో అయితే ఏకంగా 2.2శాతానికి పెరిగింది. అనంతరం తీసుకున్న చర్యలకు 2009నాటికిది 1.1శాతానికి పడిపోయింది. 1990వరకు ఏటా 17.30కోట్ల జననాలుంటే దాన్ని 14కోట్లకు తగ్గించగలిగారు. అందుబాటులో ఉన్న వివరాల మేరకు ప్రపంచంలో క్రీస్తుపూర్వం 70వేల సంవత్సరంలో ప్రపంచ జనాభా 15వేలుండేది. క్రీస్తుపూర్వం 10వేలనాటికి 10లక్షలకు చేరింది. 9వేలు నాటికి 30లక్షలు, 8వేలు నాటికి 50లక్షలు, 7వేలునాటికి 70లక్షలు దాటి క్రీస్తుపూర్వం 6వేల నాటికి జనాభా కోటి మైలురాయిని చేరుకుంది. అక్కడి నుంచి వేగంగా వృద్ధి చెందింది. క్రీస్తుపూర్వం 5వేలునాటికి 1.50కోట్లు, 4వేలు నాటికి 2కోట్లు, 3వేల నాటికి రెండున్నరకోట్లు, 2వేలనాటికి మూడున్నరకోట్లు, వెయ్యి నాటికి 5కోట్లు, 500నాటికి 10కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంది. క్రీస్తుశకం ప్రారంభమయ్యేసరికి ప్రపంచ జనాభా 20కోట్లుగా నమోదైంది. క్రీస్తుశకం వెయ్యో సంవత్సరానికి 31కోట్లకు చేరుకుంది. 1750నాటికి ఖండాలవారీగా జనగణన మొదలైంది. ఆ ఏడాది ప్రపంచ జనాభా 79.10కోట్లుగా నమోదైంది. ఆసియాలో 50.2కోట్లు, యూరోప్‌లో 16.3కోట్లు, ఆఫ్రికాలో 10.6కోట్లు, లాటిన్‌ అమెరికాలో 1.60కోట్లు, ఉత్తరఅమెరికాలో 20లక్షలు, ఆస్ట్రేలియాతో కలిపి ఒషియానియాలో 20లక్షలు జనాభా ఉన్నట్లు గుర్తించారు.
కాగా, 1804లో ప్రపంచ జనాభా మొట్టమొదటిసారిగా వందకోట్లను దాటింది. అప్పటినుంచి 123ఏళ్ళకు అంటే 1927కు 200కోట్లకు చేరిన ప్రపంచ జనాభా 33ఏళ్ళకు అంటే 1960కు 300కోట్లను నమోదు చేసింది. అక్కడినుంచి 14ఏళ్ళకే అంటే 1974కు 400కోట్లు, మరో 13ఏళ్ళకు అంటే 1987లో 500కోట్లకు చేరుకుంది. అక్కడి నుంచి 12ఏళ్ళకే 1999లో 600కోట్లను దాటేసింది. ఆ తర్వాతే మరో 12ఏళ్ళకే 700కోట్ల మైలురాయిని దాటేస్తోంది. కాగా
ఇప్పటికే తీసుకున్న జనాభా నియంత్రణ చర్యలు ఫలితాలిస్తుండడంతో మరో వందకోట్ల జనాభా పెరిగేందుకు 23ఏళ్ళు పడుతుందని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా అంచనాలు వేస్తున్నారు. 1950..2010ల మధ్య జనాభా వృద్ధి రేటు ఖండాల వారీగా చూస్తే ఆఫ్రికా అగ్రగామిగా ఉంది. ఆ ఖండంలో 26.1శాతం వృద్ధి రేటు నమోదైంది. కాగా ఆసియాలో 12.7శాతం, యూరోప్‌లో 0.8శాతం, ఉత్తర అమెరికాలో 10.4శాతం, దక్షిణఅమెరికాలో 13.2శాతం, ఓషియానియాలో 15శాతం వృద్ధి నమోదైంది. ఇప్పటికీ జనాభాలో చైనాదే అగ్రస్థానం. ఆ తర్వాత స్థానాన్ని భారత్‌ ఆక్రమిస్తోంది. మొత్తం ప్రపంచంలో 19.3శాతం జనాభా చైనాలోనే ఉంది. కాగా భారత్‌లో 17శాతం ఉంటే యుఎస్‌లో 4.48శాతం, ఇండోనేషియాలో 3.36శాతం, బ్రెజిల్‌లో 2.80శాతం, పాకిస్తాన్‌లో 2.55శాతం, బంగ్లాదేశ్‌లో 2.28శాతం, నైజీరియాలో 2.23శాతం, రష్యాలో 2.037శాతం, జపాన్‌లో 1.83శాతం జనాభా జీవిస్తున్నారు. చైనీస్‌ అఫిషియల్‌ పాపులేషన్‌ క్లాక్‌ ప్రకారం 2011అక్టోబర్‌ 17వ తేదీన చైనా జనాభా 134.69కోట్లను దాటింది. యుఎస్‌ అఫిషియల్‌ పాపులేషన్‌ క్లాక్‌ ప్రకారం అదే రోజుకు ఆదేశ జనాభా 31,24,38,217గా నమోదైంది. సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ వెల్లడించిన వివరాల మేరకు ఈ ఏడాది మార్చి 31నాటికి భారత జనాభా 120,37, 10,000సంఖ్యను దాటింది. ఇండోనేషియా జనాభా 23,84,15,631అంటూ సులోక్‌నుసంతార ఇండొనేషియా సెన్సెస్‌ రిపోర్టు ప్రకటించింది. బ్రెజిల్‌ జనాభాను 19,53,94,000గా ధృవీకరించారు. పాక్‌ జనాభా 17,75,40,000లుగా లెక్కించారు. బంగ్లాదేశ్‌ జనాభా 15,85,70,535అని, నైజీరియా జనాభా 15,52,15,000అంటూ సిఐఎ వరల్డ్‌ ఫాక్ట్‌బుక్‌ ఎస్టిమేట్స్‌ 2011సంచికలో ప్రకటించారు. రష్యా జనాభా 14,19,27,297గా ఫెడరల్‌ స్టేట్‌ స్టాటస్టిక్స్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ రష్యా పేర్కొంటే జపాన్‌ జనాభాను 12,73,87, 000అంటూ అఫిషియల్‌ జపాన్‌ స్టాటస్టిక్స్‌ బ్యూరో వెల్లడించింది. మొత్తం ప్రపంచ జనాభాలో 58.70శాతం ఈ పదిదేశాల్లో నివసిస్తున్నారు. సుమారుగా 403కోట్ల మంది ఇక్కడే ఉంటున్నారు.
ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశంగా సింగపూర్‌ రూపుదిద్దుకుంది. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్‌కు 7,331మంది జీవిస్తున్నారు. 707చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న సింగపూర్‌లో 51,83,700 మంది జనాభా ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని బంగ్లాదేశ్‌ ఆక్రమించింది. 1,47,570చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని బంగ్లాదేశ్‌లో 15.85కోట్లమంది ఉన్నారు. ఇక్కడ జనసాంద్రత చదరపు కిలోమీటర్‌కు 1069గా ఉంది. ఆ తర్వాత 702 జనసాంద్రతతో పాలస్తీనియన్‌ టెరిటోరియస్‌, 631జనసాంద్రతతో మారిషస్‌, 487తో సౌత్‌కొరియా, 404తో లెబనాన్‌, 402తో నెదర్లాండ్స్‌, 380తో రువాండ, 371తో ఇజ్రాయిల్‌ అత్యధిక జనసాంద్రతగల దేశాలయ్యాయి. కాగా బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌లను అతివేగంగా జనాభా పెంచుతున్న దేశాలుగా ప్రకటించారు. ఇండియా, వియాత్నం, యునైటెట్‌ కింగడమ్‌, శ్రీలంకలను జనాభా పెరుగుతున్న దేశాలుగానూ, సౌత్‌కొరియా, చైనా, నెదర్లాండ్స్‌ను జనాభా పెరుగుదలను అరికట్టగలిగిన దేశాలుగా, జపాన్‌ను జనాభాను తగ్గిస్తున్న దేశంగా ప్రకటించారు. కాగా 32,87,240చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 120కోట్ల జనాభాగల భారత్‌లో కూడా జనసాంద్రత 366గా ఉంది. కాగా ఐక్యరాజ్యసమితి 2010 డిసెంబర్‌లో ప్రపంచ జనాభా పెరుగుదలపై అంచనాలు రూపొందించింది. దీనిప్రకారం 2010చివరికి 689కోట్లున్న ప్రపంచ జనాభా 2020నాటికి 765కోట్లు, 2030నాటికి 800కోట్లకు 2050నాటికి 915కోట్లకు చేరుతుందని అంచనాలేశారు. కాగా భవిష్యత్‌లో ఆసియా దేశాలు జనాభాను తగ్గించుకుంటాయని కూడా ఈ అంచనాల్లో పేర్కొన్నారు. అదే సమయంలో ఆఫ్రికా దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతుదంని కూడా స్పష్టం చేశారు. 2000వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో ఆసియా భాగస్వామ్యం 60.50ఉంటే 2010నాటికది 60.30కు తగ్గింది. 2020నాటికి 59.90శాతానికి, 2040నాటికి 58.2శాతానికి, 2050నాటికి 57.2శాతానికి తగ్గిపోతుందన్నది ఈ అంచనా. కాగా 2000నాటికి ఆఫ్రికా భాగస్వామ్యం 13.40శాతం ఉంటే 2010కే ఇది 15శాతానికి పెరిగింది. 2010నాటికి 16.6, 2030 18.3, 2040నాటికి 20.1, 2050నాటికి 21.80శాతానికి పెరుగుతుందన్నది అంచనా. కాగా ఉత్తర అమెరికా 2000లో 5.2శాతం భాగస్వామ్యంతో ఉంటే ఇది 2050నాటికి 4.9శాతానికి పడిపోనుంది. యూరోప్‌ జనాభా 2000లో ప్రపంచ జనాభాలో 11.90శాతముంటే 2050నాటికి 7.60శాతానికి తగ్గిపోతుంది. ప్రపంచంలో నాగరికతతో పాటే ఆధునిక వైద్యవిధానం అందుబాటులోకొచ్చింది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మానవుడే సృష్టించుకున్నాడు. దీర్ఘకాల జీవితాన్నిచ్చే ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చుకున్నాడు. దీంతో మరణాల రేటు తగ్గింది. మనిషి ఆయుష్షు పెరిగింది. అంతమాత్రాన మానవుడు సంతోషించలేదు. తన బ్రతుకు కోసం ప్రకృతి వినాశానికి పూనుకున్నాడు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం పెరిగింది. ఊహించని, అదుపు చేయలేని అనారోగ్యాలు అలముకుంటున్నాయి. 1350లో వచ్చిన ప్లేగు ప్రపంచ దేశాల జనాభాను తుడిచిపెట్టేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఆ తర్వాత తిరిగి మానవ మనుగడ రూపుదిద్దుకుంది. ఇప్పటికే భూమికి మానవుడు భారంగా తయారయ్యాడు. జనసంఖ్యపరంగానే కాక భూమికీ, ప్రకృతికీ చేటును కొనితెస్తున్నాడు. ఈ పరిస్థితి మారకపోతే ప్రకృతి సృష్టించే విలయానికి బలికాక తప్పదు.

యుఎస్‌ సెన్సెస్‌ బ్యూరో ఇంటర్‌నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ సెంటర్‌ రూపొందించిన గణాంకాల మేరకు ప్రపంచంలో ప్రతివెయ్యిమంది జనాభాకు జనన రేటు 19గా ఉంటే మరణాల రేటు 8గా ఉంది. ప్రపంచంలో ప్రతినిమిషానికి 250మంది పుడుతుంటే 105 మంది మరణిస్తున్నారు. ప్రతిగంటకు 15వేల మంది పుడుతుంటే 6,316 మంది చనిపోతున్నారు. ప్రతిరోజు 3.60 లక్షల జననాలు, 1,51,600 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతిఏటా 13.13కోట్లమంది పుడుతున్నారు. 5.53కోట్లమంది మరణిస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచ జనాభా సగటు వయసు 67ఏళ్ళుగా లెక్కించారు. ప్రపంచ జనాభాలో 26శాతం 180కోట్లమంది 15ఏళ్ళ లోపు పిల్లలున్నారు. 66శాతం 440కోట్లమంది 15నుంచి 64ఏళ్ళ వయస్కులున్నారు. 8శాతం మంది 51.60కోట్లమంది 65ఏళ్ళకు పైబడ్డవారున్నారు.
ఇప్పటికే భూమికి మానవుడు భారంగా తయారయ్యాడు. జనసంఖ్యపరంగానే కాక భూమికీ, ప్రకృతికీ చేటును కొనితెస్తున్నాడు. ఈ పరిస్థితి మారకపోతే ప్రకృతి సృష్టించే విలయానికి బలికాక తప్పదు

దరిద్రాంధ్రప్రదేశ్‌
March 31, 2012
raIMG_2420amహైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: దునియా ముఠ్ఠీమే... ఇదొక సెలఫోన్‌ సంస్థ ప్రచార వ్యాఖ్యలు... ఒక కోణంలో నుంచి చూస్తే ప్రపంచం అరచేతిలోనే కనిపిస్తుంది. కానీ వాస్తవంగా సగటు మనిషి జీవితం నడిరోడ్డుమీద నిలబడే ఉంది. ఇది సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ 2011 అధికా రికంగా ప్రకటించిన అక్షర సత్యాలివి... శుక్రవారం సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర సంచాలకులు వై.వి.అనురాధ 2011 ఇళ్లు, ఇళ్లలో మౌలిక వసతులకు సంబంధించిన గణాంకాలను విడుదల చేశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ ఆధ్వర్యంలో సుమారు 1.8 లక్షల మంది ఎన్యూమరేటర్లు 45 రోజులపాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో శ్రమించి ఈ గణాంకాలను సేకరించారు.

ఇందులో పక్కా ఇళ్లు, ఇంటిపై కప్పు, ఇంటి గోడలు, ఇంటి ఫ్లోరింగ్‌ మొదలుకుని ఇళ్లలో వంటగది, బెడ్‌ రూం, బాత్‌ రూం, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతుల వివరాలను సైతం సేకరించారు. అంతేగాకుండా ఇళ్లలో ఎంతమంది సభ్యులు నివసిస్తున్నారు. వివాహమైన జంటలు కాపురం ఉన్న ఇళ్ల సంఖ్య ఎంత?, విద్యుదీకరణ జరిగిన ఇళ్లు ఎన్ని, ఇంకా కిరోసిన్‌ దీపాల మీద ఆధారపడి బతుకులీడుస్తున్న వారెందరు?, ఆముదం ఇతర నూనెలతో దీపాలను వెలిగించుకుని జీవనం గడుపుతున్నవారెందరు?, అన్న వివరాలను కూడా సేకరించారు. అంతేగాక శుద్ధి చేసిన రక్షిత మంచినీరు ఎన్ని ఇళ్లకు అందుతోంది అన్నది మొదలుకుని టీవీలు ఎందరు ఇళ్లలో ఉన్నాయి?, సెల్‌ ఫోన్లు ఉపయోగించుకుంటున్న ఇళ్ల సంఖ్య ఎంత?, నేటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం లేకుండా ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లే కుటుంబాల సంఖ్య ఎంత? అన్న వివరాలు కూడా సేకరించారు.

ఈ సెన్సెస్‌ బయటపెట్టిన గణాంకాలను పరిశీలిస్తే స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్ధాలు గడిచిపోతున్నా ఇంకా ఆంధ్రప్రదేశ్‌ దరిద్రాంధ్రప్రదేశ్‌గానే మిగిలి ఉందన్న కర్ణ కఠోర సత్యం బయటకొచ్చింది. నాయకులు తమ రాజకీయ ప్రయో జనాల కోసం తిమ్మిని బమ్మిని చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్‌ అని ఒకరంటే, హరితాంధ్రప్రదేశ్‌ అని మరొకరు పోటీలు పడి ప్రజలను మాటల మత్తులో ముంచెత్తి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. సెన్సెస్‌ సమచారం ప్రకారం రాష్ట్రంలో 2,55,94,996 ఇళ్లు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాలలో 1,71,74, 077 ఇళ్లు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 84,20,919 ఇళ్లు ఉన్నాయి.

అయితే ఇందులో వివిధ కారణాలరీత్యా నిర్మాణ దశలో నిలిచిపోయినవి కొన్ని, నిర్మాణం పూర్తయి ఆక్యుపేషన్‌లో లేనివి కొన్ని, నివాస యోగ్యానికి వీలులేని స్థితిలో ఉన్న ఇళ్లు మరికొన్ని మొత్తం కలిపి 18,85,565 ఇళ్లు ఉండగా అందులో గ్రామీణ ప్రాంతాలలో 12,71,199 ఇళ్లుం డగా, పట్టణ ప్రాంతాలలో 6,14, 366 ఇళ్లు ఉన్నట్లు సెన్సెస్‌ లెక్కలు బయటపెట్టాయి. మొత్తం పైన రాష్ట్రంలో 2,37,09,431 ఇళ్లను మాత్రమే ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో కేవలం నివాసయోగ్యానికి ఉపయోగించు కుంటున్నవి ఇళ్ల శాతం 86 శాతం కాగా, నివాసంతోపాటు ఇతర అవసరాలకు ఉపయోగించు కుంటున్న వాటి సంఖ్య 1.8 శాతం ఉంది. షాపులు, కార్యాలయాల కోసం ఉపయోగించు కుంటున్న వాటి సంఖ్య 3.3 శాతం ఉంది.

పాఠశాలలు, కళాశాల లకోసం ఉపయోగించుకుంటున్న వాటి సంఖ్య 0.6 శాతం ఉంది. హోటళ్లు, లాడ్జిలు, గెస్ట్‌ హౌస్‌ల కింద 0.3 శాతం ఉపయోగించుకుంటున్నారు. ఆసుపత్రులు, డిస్పెన్సరీల కింద 0.2 శాతం భవనాలు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు తదితరాల కింద 0.7 శాతం వర్క్‌షిప్‌ కింద 0.8 శాతం, నివాసేతర ఉపయోగం కింద 6.0 శాతం ఇళ్లు ఉండగా సెన్సెస్‌ యంత్రాంగం గణాంక సేకరణకు వెళ్లినప్పుడు తాళం వేసి ఉన్న ఇళ్ల సంఖ్య 73,499 ఉంటే 0.3 శాతం ఉన్నట్లు గణాంకాలు బయటపెట్టాయి.

మంచి కండీషన్‌లో ఉన్న ఇళ్ల సంఖ్య 69.8 శాతం కాగా, శిథిలావస్థకు చేరిన భవనాల సంఖ్య 3.5 శాతం ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే 15.8 శాతం ఇళ్లు గడ్డి, వెదురు, కలప, తదితర వాటితో నిర్మించినవే ఉన్నాయి. ప్లాస్టిక్‌ లేదా పాలిథిన్‌తో నిర్మితమైన ఇళ్ల సంఖ్య 0.3 శాతం ఉంది. ఇటుకతో నిర్మించిన ఇళ్ల సంఖ్య 6.1 శాతం కాగా, పెంకులతో కప్పబడిన ఇళ్ల సంఖ్య 10 శాతం మేరకు ఉంది. ఆస్‌బెస్టాస్‌ రేకులతో నిర్మించిన ఇళ్ల సంఖ్య 12.4 శాతం కాగా కాంక్రీట్‌తో నిర్మించిన ఇళ్ల సంఖ్య 48.9 శాతం ఉంది.

*రాష్ట్రంలో ప్రత్యేక గది అంటూ లేని ఇళ్ల సంఖ్య 2.9 శాతం. కాగా అందులో మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 4.2 శాతం ఇలాంటి ఇళ్లు ఉన్నాయి. అతి తక్కువగా నల్గొండ జిల్లాలో 1.7 శాతం ఉన్నాయి. రెండు గదులున్న ఇళ్లను తీసుకుంటే రాష్ట్రం మొత్తమ్మీద 34.8 శాతం ఉండగా అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే 42.01 శాతం ఆ తర్వాత 40 శాతంతో వరంగల్‌ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. అతితక్కువగా పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులో 24.5 శాతం ఉన్నాయి.
*రాష్ట్రంలో ఒకే వ్యక్తి నివసిస్తున్న ఇళ్ల సంఖ్య 5 శాతం ఉండగా, అందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా లోనే 6.8 శాతం ఆక్రమించింది. ఇద్దరు వ్యక్తులు మాత్ర మే నివసిస్తున్న ఇళ్ల సంఖ్యలో పశ్చిమ గోదావరి జిల్లా 18 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, 17.8 శాతంతో కృష్ణా జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది.

ఈ విధమైన గణనలో అతి తక్కువగా ఉన్న జిల్లాల్లో మెదక్‌, కర్నూలు జిల్లాలు 9.9 శాతంతో ఉన్నాయి. 9 మంది అంతకంటే ఎక్కువ ఒకే చోట నివాసముంటున్న ఇళ్ల సంఖ్యలో 4.8 శాతంతో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉండగా, 3.4 శాతం తో మెదక్‌ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. అతితక్కువగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు 0.5 శాతంతో చివరి స్థానంలో ఉన్నాయి.
*పెళ్లైన జంటలు జీవిస్తున్న ఇళ్ల సంఖ్య రాష్ర్టంలో పరిశీలిస్తే ఒక పెళ్లితో జీవిస్తున్న వారు ఉంటున్న ఇళ్ల సంఖ్య 75.8 శాతం కాగా, రెండు పెళ్లిళ్లతో జీవిస్తున్న ఇళ్ల సంఖ్య 9.5 శాతంగా ఉంది. మూడేసి పెళ్లిల్లు చేసేకున్న జంటల సంఖ్య కూడా 1.1 శాతం ఉంది. అయితే ఇందు లో అసలు వివాహం కాకుండానే ఒకే ఇంట్లో నివసిస్తున్న జంటల సంఖ్య 13.4 శాతం ఉంది. ఇందులో అత్యధి కంగా వివాహం కాకుండా జీవిస్తున్న జంటలు నివసిస్తున్న ఇళ్లున్న జిల్లాల్లో 16.2 శాతంతో తూర్పుగోదావరి ప్రథమ స్థానంలో ఉండగా 9.9 శాతంతో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లు సెన్సస్‌లో తేలింది.

*రాష్ట్రంలో 69.9 శాతం ఇళ్లకు మాత్రమే నల్లా నీరు లభిస్తోంది. అందులో కూడా 49 శాతం ఇళ్లకే శుద్ధి చేసిన నీరు లభిస్తోంది. 6.4 శాతం ఇళ్లు ఇంకా బావులపైనే ఆధారపడి ఉన్నాయి. నల్లా నీటిని ఉపయోగించుకుంటున్న జిల్లాల్లో 97.7 శాతంతో హైదరాబాద్‌, 87 శాతంతో రంగారెడ్డి జిల్లాలు ప్రథమ వరుసలో ఉండగా, 26 శాతంతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది.
*రాష్ట్రం మొత్తమ్మీద 92.2 శాతం ఇళ్లు విద్యుత్‌ను ఉపయోగించుకుంటుండగా అందులో హైదరాబాద్‌ 98.7 శాతం, రంగారెడ్డి 95.9 శాతంతో అగ్ర భాగాన, మహబూ బ్‌నగర్‌ జిల్లా 86.7 శాతంతో చివరి స్థానంలో ఉంది.
*కిరోసిన్‌ వెలుగును నమ్ముకున్న జిల్లాల్లో 11.5 శాతంతో అదిలాబాద్‌ ప్రథమ స్థానంలో ఉంది.
*రాష్ట్రంలో 48.48 శాతం కుటుంబాలు ఇంకా కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటి పొలాల బాటనేపడుతున్నాయి. 2.5 శాతం మంది మాత్రమే పబ్లిక్‌ టాయిలెట్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్న వారికి సంబంధించి 77.4 శాతంతో శ్రీకాకుళం, 76.6 శాతంతో విజయనగరం జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్రంలో సొంత ఇళ్లు ఉన్న వారి శాతం 78.5 కాగా అందులో 91.6 శాతంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

*రాష్ట్రంలో 58.8 శాతం ఇళ్లలో టీవీలు ఉండగా అందులో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలే 84.7, 75.2 శాతంతో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా 41.5 శాతంతో చివరి స్థానంలో ఉంది. సెల్‌ఫోన్‌లు ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రం మొత్తమ్మీద 54.9 శాతం ఉండగా అందులో 71.3 శాతంతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 39.6 శాతంతో విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది.

14, జులై 2012, శనివారం


 సెడ్ మొదటి టాప్ 10 కోటీశ్వరుల జాబితా:
 సెడ్ మొదటి టాప్ 10 కోటీశ్వరుల జాబితా:
కార్లోస్ స్లిమ్ Helu (మెక్సికో) 74 బిలియన్ డాలర్లు
బిల్ గేట్స్ (అమెరికా సంయుక్త) 56 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ (అమెరికా సంయుక్త) 50 బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఫ్రాన్స్) 41 బిలియన్ డాలర్లు
లారీ ఎలిసన్ (అమెరికా సంయుక్త) 39.5 బిలియన్
లక్ష్మి మిట్టల్ (భారతదేశం) 31.1 బిలియన్
Amancio ఓర్టెగా (స్పెయిన్) 31 బిలియన్
బాలికల బాటిస్టా (బ్రెజిల్) 30 బిలియన్
ముకేష్ అంబానీ (భారతదేశం) 27 బిలియన్
క్రిస్టీ వాల్టన్ (అమెరికా సంయుక్త) 26.5 బిలియన్.
 సెడ్ మొదటి టాప్ 10 కోటీశ్వరుల జాబితా:
కార్లోస్ స్లిమ్ Helu (మెక్సికో) 74 బిలియన్ డాలర్లు
బిల్ గేట్స్ (అమెరికా సంయుక్త) 56 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ (అమెరికా సంయుక్త) 50 బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఫ్రాన్స్) 41 బిలియన్ డాలర్లు
లారీ ఎలిసన్ (అమెరికా సంయుక్త) 39.5 బిలియన్
లక్ష్మి మిట్టల్ (భారతదేశం) 31.1 బిలియన్
Amancio ఓర్టెగా (స్పెయిన్) 31 బిలియన్
బాలికల బాటిస్టా (బ్రెజిల్) 30 బిలియన్
ముకేష్ అంబానీ (భారతదేశం) 27 బిలియన్
క్రిస్టీ వాల్టన్ (అమెరికా సంయుక్త) 26.5 బిలియన్.
కార్లోస్ స్లిమ్ Helu (మెక్సికో) 74 బిలియన్ డాలర్లు
బిల్ గేట్స్ (అమెరికా సంయుక్త) 56 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ (అమెరికా సంయుక్త) 50 బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఫ్రాన్స్) 41 బిలియన్ డాలర్లు
లారీ ఎలిసన్ (అమెరికా సంయుక్త) 39.5 బిలియన్
లక్ష్మి మిట్టల్ (భారతదేశం) 31.1 బిలియన్
Amancio ఓర్టెగా (స్పెయిన్) 31 బిలియన్
బాలికల బాటిస్టా (బ్రెజిల్) 30 బిలియన్
ముకేష్ అంబానీ (భారతదేశం) 27 బిలియన్
క్రిస్టీ వాల్టన్ (అమెరికా సంయుక్త) 26.5 బిలియన్.

ఫోర్బ్స్‌ ప్రపంచ కుభేరుల జాబితాలో

బిల్‌గేట్స్‌ రెండవ స్థానంలో నిలవగా, మూడవ స్థానంలో వారెన్‌బఫెట్‌ నిలిచారు. భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ నాల్గవ స్థానంలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ 5వ స్థానంలో నిలిచారు. మరో నలుగురు భారతీయులు తొలి 50 మంది ప్రపంచ ధనవంతుల జాబితాల్లో చోటు దక్కించుకున్నారు. 2010 సంవత్సరంలో ప్రపంచ ధనవంతుల జాబితాను ప్రముఖ వాణిజ్య పత్రిక 'ఫోర్బ్స్‌' విడుదల చేసింది. 4వ స్థానంలో నిలిచిన ముఖేష్‌ అంబానీ 29 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారని ఫోర్బ్స్‌ పత్రిక తెలిపింది. 13.7 బిలియన్‌ డాలర్లతో ఆయన తమ్ముడు అనీల్‌ అంబానీ 36వ స్థానంలో నిలిచాడు. 28.7 బిలియన్‌ డాలర్ల ఆస్థులతో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌ 5వ స్థానంలో నిలిచారు. భారత దేశంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని మిట్టల్‌ భావించారు. ఒరిస్సా, జార్ఖండ్‌ రాష్ట్రాలలో స్టీలు కర్మాగారాలు నిర్మించాలని ప్రయత్నించినా ప్రభుత్వం ఆమోదాన్ని పొందలేకపోయారని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఆయనను లండన్‌లో నివసించే అత్యంత ధనవంతులైన భారతీయుడుగా పత్రిక అభివర్ణించింది. ఇక పోతే భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల రంగంలో మూడవ స్థానంలో నిలిచిన విప్రో సంస్థ అధిపతి అజీం ప్రేంజీ పదిహేడు బిలియన్‌ డాలర్ల ఆస్థులతో 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఎస్‌ఆర్‌ గ్రూఫ్‌ అధిపతులైన శశి, రవిరూయా సోదరులు 13 బిలియన్‌ డాలర్ల సంపదతో 40వ స్థానంతో సరిపెట్టుకున్నారు. స్టీలు, చమురు, ఇంధన రంగాలలో తమ వ్యాపారాలను విస్తరించే క్రమంలో ఈ సంస్థ కొద్దిగా వెనకడుగు వేయడంతో వారి ఆదాయానికి కొంత గండిపడింది. ఇక తొలి 50 స్థానాల జాబితాలో చివరి స్థానంలో సావిత్రీ జిందాల్‌ నిలిచారు. 12.2 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో ఆమె 44వ స్థానంలో ఉన్నారు. 2005 లో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఆమె భర్త మరణానంతరం గోపీ జిందాల్‌ గ్రూఫ్‌ అధినేతగా పగ్గాలు చేపట్టారు. జాబితాలో చోటు చేసుకున్న భారతీయుల వివరాలు ఇలా ఉన్నాయి. 74వ స్థానంలో కుషాల్‌ పాల్‌సింగ్‌, 85 స్థానంలో కుమార్‌ బిర్లా, 87వ స్థానంలో సునీల్‌ మిట్టల్‌, 113 స్థానంలో అనీల్‌ అగర్వాల్‌, 148వ స్థానంలో ఆది గోద్రెజ్‌ కుటుంబం, 201 వ స్థానంలో శివ్‌నాడార్‌, 616వ స్థానంలో ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, ఆయన కుటుంబం, 880వ స్థానంలో రాహూల్‌ బజాజ్‌, 937వ స్థానంలో విజయ్‌మాల్యా ఉన్నారు.
అగ్రస్థానంలో స్లిమ్‌ హెలు
ఫోర్బ్స్‌ ప్రకటించిన 1011 మంది ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో మెక్సికోకు చెందిన వ్యాపార దిగ్గజం కార్లో స్లిమ్‌ హెలు అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను రెండవ స్థానంలోకి తోసి ఈయన తొలిస్థానాన్ని ఆక్రమించారు. గత ఏడాదిగా 18.5 బిలియన్‌ డాలర్ల ఆస్థులను పెంచుకొని 53.5 బిలియన్‌ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని సంపాదించుకున్నారు. గత పదిహేను ఏళ్ళుగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అటూ ఇటూగా అగ్రస్థానంలో కొనసాగుతున్న గేట్స్‌ను కార్లో అధిగమించారు. 53 బిలియన్‌ డాలర్ల సంపదతో గేట్స్‌ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్నారు. రెండంకెల స్థానంలో జాబితాలో చోటు చేసుకున్న దేశాలలో భారత్‌, చైనా, టర్కి, దక్షిణకోరియా దేశాలు ఉన్నాయి. 

బోస్టన్: ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తల సంపాదన శోభిల్లింది. అమెరికా దిగ్గజ ధనవంతుల జాబితాలో మనవారు నలుగురికి చోటు లభించింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన 400 మందితో కూడిన అమెరికా ధనవంతుల జాబితాలో నలుగురు ఎన్నారైలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ కోస్లా, సింటెల్ వ్యవస్థాపకుడు భరత్ దేశాయ్, కవితర్క్ రామ్ శ్రీరామ్, సాఫ్ట్‌వేర్ రాజు రమేష్ వద్వానీ వివిధ స్థానాల్లో ఉన్నారు. ఎప్పటిలాగానే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అమెరికా కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచి వెలిగారు!.

అమెరికా ధనవంతుల జాబితాలో వినోద్ కోస్లా 1.3 బిలియన్ డాలర్ల సంపదతో 308వ స్థానంలో నిలిచారు. భరత్ దేశాయ్ 1.6 బిలియన్ డాలర్ల ఆర్జనతో 252వ స్థానం సాధించారు. అలాగే 1.45 బిలియన్ డాలర్ల సంపాదనతో శ్రీరామ్ 288, 1.4 బిలియన్ల సంపాదనతో వద్వానీ 290 స్థానం పొందారు. అయితే ఈ జాబితాలో ప్రవాస భారతీయుల్లో ఒక్కరు కూడా టాప్-100లో చోటు దక్కించుకోలేక పోవడం శోచనీయం. ఇకపోతే, గత పదిహేడేళ్ళ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 54 బిలియన్ డాలర్ల సంపాదనతో బిల్‌గేట్స్ దేశీ ధనవంతుల జాబితాలో ప్రథమస్థానాన్ని అధివహించారు.

13, జులై 2012, శుక్రవారం


ఐరాస మానవాభివృద్ధి సూచీలో 134వ స్థానంలో భారత్

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలో మన దేశం 187 దేశాల్లో 134వ స్థానంలో నిలిచింది. గత ఇరవై ఏళ్ల కాలంలో ప్రసూతి సమయంలో శిశువుల ఆయుః ప్రమాణాలు ఏడాదికి 10.1 శాతం చొప్పున పెరిగినట్లు ఓ వైపు ఆ సూచీ వెల్లడిస్తూ ఉన్నప్పటికీ మన దేశం ఆ సూచీలో ఇంకా అట్టడుగు స్థాయిలోనే నిలవడం గమనార్హం. యుఎన్‌డిపి రూపొందించిన 2010 సంవత్సరపు మానవాభివృద్ధి సూచీలో మన దేశం మొత్తం 169 దేశాల్లో 119వ స్థానంలో ఉండింది. అయితే గత నివేదికల్లో ప్రచురించిన విలువలు, ర్యాంకింగ్‌లతో పోల్చడం తప్పుదారి పట్టించడమే అవుతుందని, ఎందుకంటే వివరాలు, వాటిని సేకరించే విధానాలు మారిపోయాయని, అలాగే మానవాభివృద్ధి సూచీలో చేర్చిన దేశాల సంఖ్య కూడా మారిపోయిందని 2011 సంవత్సరానికి రూపొందించిన తాజా నివేదిక అభిప్రాయ పడింది. 2011 సంవత్సరానికి గాను భారత దేశ మానవాభివృద్ధి సూచీ ర్యాంక్ 0.547 గా పేర్కొన్న నివేదిక మధ్యస్థాయి మానవాభివృద్ధి కేటగిరీలో దాన్ని చేర్చింది. మన పొరుగుదేశాలయిన పాకిస్తాన్ ఈ జాబితాలో 146(0.504), బంగ్లాదేశ్ 146(0.500) స్థానాల్లో ఉన్నాయి. 1980, 2011 మధ్య కాలంలో భారత దేశ మానవాభివృద్ది సూచీ 0.344 నుంచి 0.547కు పెరిగిందని, అంటే 59 శాతం లేదా సగటున ఏడాదికి1.5 శాతం పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.
అయితే దేశ మానవాభివృద్ధి సూచీ ఇప్పటికీ మధ్యస్థాయి మానవాభివృద్ధి గ్రూపు దేశాల సగటు అయిన 0.630కన్నా, అలాగే తూర్పు ఆసియా దేశాల సగటు అయిన 0.548కన్నా కూడా తక్కువే ఉందని ఆ నివేదిక అభిప్రాయ పడింది. మానవాభివృద్ధికి సంబంధించి మూడు ప్రధాన అంశాలు అంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం, తెలివితేటలను పెంచుకునే అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా మానవాభివృద్ధి సూచీని లెక్కగడ్తారు. దేశంలో పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకునే సంవత్సరాలు 1980నుంచి 2011 మధ్య కాలంలో 3.9 ఏళ్లు పెరిగినట్లు కూడా ఆ నివేదిక వెల్లడించింది.

న్యూఢిల్లీ: దేశంలో సగంమందిి బాత్‌రూమ్‌ సౌకర్యం లేకున్నప్పటికి, అంతకంటే ఎక్కువమందికి మొబైల్‌ఫోన్లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల్లో భాగంగా సేకరించిన ఇళ్ళల్లో ప్రాథమిక సౌకర్యాలు, ఇళ్ళు, ఇతర ఆస్తుల వివరాలను మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్‌కె. సింగ్‌ విడుదలచేశారు. ఇందులో పలు ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి. దేశంలోని 24.66 కోట్ల కుటుంబాల్లో 46.9 శాతం కుటుం బాలు మరుగుదొడ్ల సౌకర్యానికి నోచులేకపోతున్నారు. 49.8 మంది ప్రజలు ఆరుబయటే స్నానాదులు తదితర పనులు చేసుకుంటున్నారు. 3.2 శాతం ప్రజలు పబ్లిక్‌ టాయిలెట్లపై ఆధారపడుతున్నారు.

మరుగుదొడ్ల లేమిలో జార్ఖండ్‌ టాప్‌
జార్ఖండ్‌లో అత్యధికంగా 77 శాతం కుటుంబాలకు ఎటువంటి మరుగుదొడ్ల సదుపాయాలు లేవు. అదేవిధంగా ఒడిశాలో 76.6 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేమితో రెండవ స్థానంలో ఉంది. 75.8 శాతంతో బీహార్‌ ఆ తర్వాత స్థానంలో ఉంది. ఈ సౌకర్యాల మాట అటుంచుతే 63.2 శాతం కుటుంబాలు ఏదోఒక ఫోనును కలిగివుండగా, వారిలో 53.2 శాతం మంది మొబైల్‌ ఫోన్లను కలిగివున్నారు. రాష్ట్రాల వారీగా కుటుంబాలు కలిగివున్న టెలీఫోన్ల సాంద్రతను పరిశీలిస్తే క్షద్వీప్‌లో 93.6 శాతం కుటుంబాలు ఏదోఒక టెలీఫోన్‌ సెట్‌ను కలిగివున్నారు. కాగా ఢిల్లీ 90.8 శాతం కుటుంబాలు, చండీగఢ్‌ 89.2 శాతం కుటుంబాలతో తర్వాత స్థానాలను పొందాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 62.5 శాతం ప్రజలు ఇప్పటికి వంట ఇందనంకోసం కట్టెలపైై ఆదారపడుతున్నారు.

దేశంలో 44.8 శాతం ప్రజలు రవాణ సాధనంగా సైకిల్‌ను ఉపయోగిస్తున్నప్పటిి, టూ వీలర్‌ ఉన్న కుటుంబాలు 21 శాతం ఉన్నాయి. దేశంలో 4.7 శాతం ప్రజలు ఫోర్‌ వీలర్‌ను కలిగివున్నారు. దేశంలో కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యాలు కేవలం 3.1 శాతం మందికే అందుబాటులో ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 32 శాతం కుటుంబాలకు శుద్ధిచేసిన తాగునీరు అందుబాటులో ఉండగా, 49 శాతం మంది వంటచెరుకును ఇందనంగా వాడుతున్నారు. 28.6 కుటుంబాలు ఎల్‌పీజీ లేదా పీఎన్‌జీని ఇందనంగా ఉపయోగిస్తున్నారు. మురుగునీటి సదుపాయం లేని కుటుంబాలు 48.9 శాతం ఉండగా, 33 శాతం కుటుంబాలకు ఒపెన్‌ మురుగునీటి వ్యవస్థను కలిగివున్నారు. అయితే 86.6 శాతం మంది భారతీయలు సొంత ఇళ్ళల్లో నివసిస్తుంటే వారిలో 36.6 శాతం ప్రజలు ఒక గదిలోనే నివసిస్తున్నారు. 31.7 శాతం ప్రజలు రెండు గదుల్లో నివసిస్తున్నారు. 14.5 శాతం ప్రజలు మూడు గదుల్లో నివసిస్తున్నారు.

వినోదాన్ని అందించే సాధనాల్లో టెలివిజన్‌దే ప్రథమ స్థానంగా తేలింది. 47.2 శాతం కుటుంబాలు టెలివిజన్‌ను కలిగివున్నారు. కాగా 19.9 శాతం కుటుంబాలు రేడియో లేదా ట్రాన్సిస్టర్‌ను కలిగి ఉన్నారు. ప్రజలు అనారోగ్యకరమైన ఈ అలవాట్లను పాటించటానికి ప్రధాన కారణాలుగా సాంప్రదాయ, తరతరాలనుంచి వస్తున్న సంస్కృతి, విద్యలేమి అని రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సెస్‌ కమిషనర్‌ సి.చంద్రమౌళి విలేకరులతో అన్నారు

 అవినీతి ఆందోళనకరం
   మానవాభివృద్ధిలోనూ అధమ స్థానం
 అరవై ఐదేళ్ల స్వాతంత్య్రంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోందని సంబరపడితే అది ఆత్మవంచనే అవుతుంది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో అవినీతి తాండవిస్తోంది. అదే ప్రజల పాలిట శాపంగా మారింది. అక్షరాస్యతలో చెప్పుకోదగ్గ పురోగతి లేదు. మానవాభివృద్ధి సూచీలోనూ మన పొరుగు దేశాలకన్నా, కొన్ని ఆఫ్రికా దేశాల కన్నా వెనకబడి ఉన్నాం. సాధారణంగా ఆఫ్రికాను చీకటి ఖండంగా పిలుస్తారు. ఆ ఖండంలోని దేశాల్లో అవినీతి ఎక్కువ, అభివృద్ధి తక్కువ అని భావిస్తాం. నిజానికి అనేక ఆఫ్రికా దేశాలు చాలా విషయాల్లో మనకన్నా మెరుగ్గా ఉన్నాయి.        
  భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 60 శాతం మంది రోజుకు 35, అంతకంటే తక్కువ ఖర్చుతో జీవనం గడుపుతున్నారు. నగరాల్లోనూ 60 శాతం మందికి రోజుకు రూ. 66తోనే బతుకు వెళ్లదీస్తున్నారు. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ వెల్లడించిన వాస్తవాలివి. ఇది కూడా ఒక శాంపిల్‌ సర్వేనే అని సరిపెట్టుకునే చిన్న విషయం కాదు. పేదల బాగు కోసం ఎన్నో పథకాలు. వేల కోట్ల ఖర్చు. అయినా ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఇంకా ఇంత పేదరికం ఎందుకు తాండవిస్తోంది?
    ఆధునిక యుగంలో ఏ దేశమైనా ముందుకు వెళ్లడానికి అక్షరాస్యత చాలా ముఖ్యం. ఈ విషయంలో ప్రపంచంలో మనం తలెత్తుకు నిలబడే పరిస్థితిలో లేము. భారత్‌లో అక్షరాస్యత 75 శాతం. పొరుగుదేశం శ్రీలంకలో ఇది 94 శాతం. ఆఫ్రికా దేశం కెన్యాలో 84 శాతం. ఇండోనేషియా 92 శాతం, బ్రెజిల్‌ 90 శాతం అక్షరాసత్య సాధించాయి.
     దేశ అభివృద్ధికి ముఖ్యమైన కొలమానాల్లో మానవాభివృద్ధి సూచీ (హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌) ఒకటి. ఇందులోనూ ఏమున్నది గర్వకారణం అన్నట్టే ఉంది మన పరిస్థితి. ఈ విషయంలో భారత్‌ ర్యాంకు ఎక్కడో చిట్ట చివరన 136. ఆఫ్రికా దేశం నమీబియా కూడా మనకన్నా మెరుగ్గా 124వ ర్యాంకు సాధించింది. శ్రీలంక ర్యాంకు 97. మరి అభివృద్ధి కోసం చేస్తున్న వేలూ లక్షల కోట్లు ఏమైనట్టు అంటే అదే అంతు పట్టదు.
   జీవన ప్రమాణాల విషయంలోనూ మనం దిగదుడుపే. భారత్‌లో లైఫ్‌ ఎక్స్‌పెక్టెన్సీ 64.7 ఏళ్లు. 139వ ర్యాంకు. ప్రపంచ సగటు కన్నా ఇది తక్కువ. జపాన్‌ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. చివరికి పాకిస్తాన్‌ కూడా 65.6తో మన కన్నా మెరుగ్గా 137వ ర్యాంకు పొందింది. శ్రీలంక ర్యాంకు 91.
   ఇక, భారత్‌ 'గొప్పగా' చెప్పుకోగలిగే అంశం అవినీతి. ఈ విషయంలో మన రికార్డు పదిలం. కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌ ప్రకారం అవినీతిలో భారత్‌ది 94 స్థానం. చీకటి ఖండం ఆఫ్రికాలోని నమీబియా (57వ ర్యాంకు), జాంబియా (91వ ర్యాంకు)ల్లోనూ మన కన్నా అవినీతి తక్కువ. మరో ఆఫ్రికా దేశం రువాండా అయితే 49వ ర్యాంకు పొందింది. అంటే మనతో పోలిస్తే అక్కడ అవినీతి చాలా తక్కువ. సూచీలో శ్రీలంక 86వ ర్యాంకుతో ఈ విషయంలోనూ మన కంటే మెరుగ్గా ఉంది.          
ే     వేళ్లమీద లెక్కించే కుబేరుల సంఖ్య పెరుగుతోందని సంతోషించి, కుచేలుర దుస్థితికి బాధ్యులు ఎవరనే విషయాన్ని విస్మరించినంత కాలం దేశం ఇలాగే ఉంటుంది. రాజకీయ నాయకులు నిరంతరం ప్రజా సేవ చేస్తుంటారు. ప్రభుత్వాలు ప్రతి క్షణం పేదల బాగు కోసమే పరితపిస్తుంటాయి. అయినా పేదలు పేదలుగానే ఉంటారు. ధనికులకు, పేదలకూ మధ్య, పల్లెకూ పట్నానికి మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. తినడానికి తిండిలేని ప్రజలు తిరగబడ లేరులే అని పాలకులు భావిస్తే అది పొరపాటే. ఆకలి మంటతో విలవిల్లాడే ప్రజలు ప్రశ్నించే రోజు వస్తే, ఏ పాలకులూ తట్టుకోలేరు. అలాంటి పరిస్థితి రాకముందే పాలకులు చిత్తశుద్ధితో పనిచేసే శుభఘడియలు మొదలు కావాలని ఆకాంక్షిద్దాం. 


నిత్యావసర సరుకుల ధరలు అరికట్టాలి నిత్యావసర సరుకుల ధర పెరుగుదలకు ప్రభుత్వం చేసే వాదనలు మోసపూరితమైనవి:
ఒకటి: రైతుకొచ్చే మద్దతు ధరలు పెరుగుతున్నందునే ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం వాదించడంలో వాస్తవం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం కిలో వరి 2011లో 10రూ.80 పైసలు. మరి కిలో బియ్యం బహిరంగ మార్కెట్‌లో 24 రూ.లకి తక్కువగా ఎక్కడా ఎందుకు దొరకటం లేదు?
రెండు: ప్రజల ఆదాయాలు పెరిగి జేబుల్లో డబ్బు ఎక్కువై ధరలు పెరుగుతున్నాయని మరోవాదన.
అసలు కారణాలు
ప్రభుత్వ వాదన నిజమయితే 2005-06లో 8.6 శాతంగా వున్న వినిమయ ఖర్చు 2010-11లో 7.3 శాతానికి ఎందుకు పడిపోయింది. ప్రభుత్వం నియమించిన అర్జున్‌సేన్‌ గుప్తా నివేదిక ప్రకారం ఈ దేశంలో నూటికి 77 మందికి రోజుకి రూ. 20లోపు మాత్రమే వస్తుంది. మరిక జేబులో డబ్బు ఎక్కువైంది ఎక్కడీ మొత్తం కార్మిక వర్గంలో నూటికి51 మంది స్వయంఉపాధి కార్మికులు, 33.5 మంది క్యాజువల్‌ 15.6 మంది వేతన కార్మికులు వీరిలో మళ్లీ అత్యధికులు కాంట్రాక్టు కార్మికులు. వీరి జేబుల్లో డబ్బులు ఎలా గలగల్లాడతాయి?
1. సరుకు దాచివేత 2) భవిష్యత్‌ లాభాలను ఆశించి చేసే స్పెక్యులేటివ్‌ వ్యాపారం 3) తప్పుడు ఎగుమతి విధానం. 4. ఆహార వ్యాపారంలోకి కార్పొరేట్‌ దిగ్గజాల చొరబాటు. 5. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రభుత్వం పెంచటం 6) వడ్డీరేట్లు పెంచిన ప్రభుత్వం 7) ప్రధాన ఆహార పంటలు డిమాండ్‌కు తగ్గట్టుగా పండకపోవటం 8) రూపాయి విలువ పడిపోవటం.
డిమాండ్స్‌: ధరలు పెరుగుదలకు దారితీసే ప్రభుత్వ విధానాలు మారాలి. స్పెక్యులేటివ్‌ వ్యాపారాన్ని నిషేధించాలి-గోడౌన్లలోవున్న స్టాకును విడుదలచేసి చౌక ధరలకు విక్రయించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలి. పెట్రోలియం ఉత్పత్తులపై వేస్తున్న లక్షా30 వేల కోట్ల రూపాయల పన్నులను తీవ్రంగా తగ్గించాలి. విదేశీ ఫైనాన్స్‌ పెట్టుబడులపై ఆధారపడటం మానుకోవాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆర్థిక సంక్షోభం పేరుతో ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఉద్దీపనా పథకం క్రింద ఇచ్చింది. రూ.2 లక్షల కోట్లు. మూడు సంవత్సరాల్లో కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన పన్ను రాయితీలు రూ.14 లక్షల కోట్లు
అయినా ఉపాధి పెరుగుదల రేటు 2.7 శాతం నుండి 0.8. శాతానికి పడిపోయింది. ప్రజల డబ్బుతో జేబులు నింపుకున్న కంపెనీలు లక్షలాది మంది కార్మికులను సంక్షోభం పేరుతో తొలగించాయి. కనీస వేతనాలు, పి.ఎప్‌. ఇ.ఎస్‌ఐలను ప్రయివేటు కంపెనీలు చెల్లించవు. ప్రభుత్వ మరియు కార్పొరేట్‌ శక్తుల దోపిడీని అరికట్టి కార్మికులకు ఉపాధి ఉద్యోగ భద్రత కల్పించాలి.
అసంఘటిత కార్మికులందరికి సామాజిక భద్రత కల్పించాలి
స్థూల జాతీయోత్పత్తిలో 60 శాతం వాటా అందిస్తూ 93 శాతంగా వున్న అసంఘటిత కార్మికులకు దక్కుతున్నదేమిటి? పని గంటలు, కనీస వేతనాలు, ఆసుపత్రి సౌకర్యం, ప్రమాద భీమా సౌకర్యం పి.ఎప్‌, పెన్షన్‌ ఏమీలేవు.
అత్యధిక శాతం మంది కార్మిక చట్టం పరిధిలోకేరారు. వీటన్నిటిని కల్పిస్తూ చట్టం చేయాలని అషిస్‌సేన్‌ గుప్తా కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం తుంగలో తొక్కింది.
పోరాడగా, పోరాడగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం అసంఘటిత కార్మికుల్ని మోసం చేసేదిగా వుంది. అదొక పేపరు పులిలాంటిది. కనీస వేతనం , పని గంటలు ఉద్యోగ భద్రత, జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్యం, ప్రసూతి సౌకర్య, పెన్షను సౌకర్యాలను ఎటువంటి మినహాయింపులు లేకుండా అసంఘటిత కార్మికులందరికీ కల్పించాలి. అందుకు అవసరమైన మార్పులను చట్టంలో చేయాలి. దీనికయ్యే మొత్తం ఖర్చును కేంద్రప్రభుత్వమే బడ్జెట్‌ నుండి కేటాయించాలి.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని నిలిపేయాలి:
దేశ, విదేశీ పెట్టుబడిదార్లకు ప్రభుత్వరంగాన్ని దశల వారీగా ఒప్పగించటాన్ని నిలిపివేయాలి. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటానికి వాటాల విక్రయం చేస్తున్నా మన్న ప్రభుత్వ వాదన వాస్తవమా? ఇప్పటి వరకు జరిగిన ప్రయివేటీకరణలో ప్రజల చేతుల్లోకి పోయింది ఒక శాతం మాత్రమే. మిగతా మొత్తం భాగాన్ని కార్పొరేట్‌ కంపెనీలు, బహుళజాతి గుత్త కంపెనీలు, ప్రయివేటు మ్యూచువల్‌ ఫండ్స్‌ హస్తగతం చేసుకున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థల ఆధునీకరణ కోసం వాటాలు విక్రయిస్తున్నామని ప్రభుత్వం మరో తప్పుడు వాదన చేస్తోంది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల వద్ద రూ. ఐదు లక్షల కోట్ల పైగా ఉన్న నగదు నిల్వలు వాటి ఆధునీకరణకు పనికిరావా? విస్తరణకు పనికిరావా? సంక్షేమరంగ ఖర్చుల కోసం వాటాలు విక్రయిస్తున్నామని ప్రభుత్వం చెప్పటాన్ని కూడా ఆమోదించకూడదు. సంక్షేమ సౌకర్యాలు కల్పించటం ప్రభుత్వాల బాధ్యత. ఆ పేరుతో మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రయివేట్‌ వారి చేతుల్లో పెట్టటాన్ని అమోదించకూడదు.
శాశ్వత పనుల్లో కాంట్రాక్టీకరణ ఉండకూడదు. పర్మినెంట్‌ పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్‌ వర్కర్ల వేతనాలు, బెనిఫిట్లు ఇవ్వాలి.
కార్మికులను దోపిడీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హద్దుల్లేవు. పర్మినెంట్‌ కార్మికులు చేస్తున్న పనిని చేయించుకుంటూ వారికి కాంట్రాక్టు కార్మికులనే పేరుతో అతితక్కువ వేతనాలిచ్చి, ఎటువంటి సామాజిక భద్రత లేకుండా దోపిడీ చేసేందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా అనుమతిస్తున్నది.
10 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి.
15వ లేబరు కాన్ఫరెన్సు సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం ఉన్న ధరలలో 2700 క్యాలరీల ఆహారం, ఇంటి అద్దె, బట్టలు, ఇంధన ఖర్చులు, పిల్లల చదువులు, రవాణా ఖర్చులు భరించాలంటే కనీసం 10 వేల రూపాయల వేతనం వుండాలి. దాని మీద వి.డి.ఏ ఇవ్వాలి. షెడ్యూల్స్‌తో నిమిత్తం లేకుండా కార్మికులందరికీ ఈ వేతనం వర్తింప జేయాలి. గౌరవ వేతనం ప్రోత్సాహకాలు, పారితోషికాల పేర్లతో పని చేస్తున్న వారందరికీ ఈ వేతనం ఇవ్వాలి.
కనీస వేతనాలు ఇస్తే పరిశ్రమలు నడవవని యజమానులు చేస్తున్న వాదన పచ్చి అబద్ధం. ఉత్పత్తిలో అదనంగా చేరుతున్న విలువలో వేతనం వాటా 2001లో 30 శాతం నుండి 2009లో 9.5 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో అదనంగా చేరుతున్న విలువలో వేతనం వాటా లాభాల శాతం 15 నుండి 55కు పెరిగింది. కార్మికుల శమ్రను యజమానులు కొల్లగొట్టటాన్ని ఇంకెంత మాత్రం అనుమతించకూడదు.
పి.ఎఫ్‌ బోనస్‌ల మీద సీలింగులు ఎత్తివేయాలి. గ్రాట్యుటీని పెంచాలి:
65 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఇప్పటికీ అత్యధిక కార్మికులకి పి.ఎప్‌,బోనస్‌, గ్రాట్యుటీలు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో తెలియదు. అవి వర్తించే కార్మికులు, ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. ఇ.పి.ఎఫ్‌ చట్టం వర్తించే కార్మికులకు 6500 వేతనం వరకే పి.ఎఫ్‌ను పరిమితం చేశారు. ఫలితంగా ఇ.పి.ఎఫ్‌్‌ పెన్షన్‌ కూడా చాలా తక్కువ వస్తుంది. 10 వేల రూపాయల వేతనం దాటితో బోనస్‌ లేదు. 10 వేలు, ఆలోపు వేతనం వచ్చే కార్మికులకు కూడా వేతనాన్ని 3,500 గానే లెక్కలోకి తీసుకొని బోనస్‌ ఇస్తున్నారు.గ్రాట్యూటి మీద కూడా సీలింగు పెట్టారు.
అందరికీ గ్యారంటీతో కూడిన పెన్షన్‌ ఇవ్వాలి.
కార్మికులకు ఉద్యోగులకు వున్న పెన్షన్‌ హక్కులను పాతిపెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఆ కుట్రలో భాగమే పార్లమెంటులో ప్రవేశపెట్టిన పెన్షన్‌ బిల్లు. ఈ కుట్రలో యుపిఏ ప్రభుత్వానికి బిజెపి సహ భాగస్వామిగా ఉంది.
1995లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఇ.పి.ఎఫ్‌ఒక ఫార్సు స్కీముగా మారింది. అప్పుడు వాగ్దానం చేసిన అనేక సౌకర్యాలు ఇప్పటికే కత్తిరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్న పెన్షన్‌ స్థానంలో కొత్త పెన్షన్‌ స్కీం వచ్చింది. ఇందులో పెన్షన్‌ కోసం ఉద్యోగులు డబ్బులు కట్టుకున్నా పెన్షన్‌ వస్తుందన్న గ్యారంటీ లేదు. అసంఘటిత కార్మికులను కూడా స్వావలంబన పేరుతో కొత్త పెన్షన్‌ పథకానికి డబ్బులు కట్టేలా గాలం వేస్తున్నారు. వీరి పెన్షనుకు కూడా ఎటువంటి గ్యారంటీ లేదు. ఉద్యోగులు, కార్మికులు కట్టే డబ్బులను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదార్లు షేర్‌మార్కెట్‌కు తరలించేందుకు తెచ్చిన ఈ పథకాలను వ్యతిరేకించాలి. పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఏ చట్టం తెచ్చి కార్మికుల కష్టార్జితాన్ని కాజేయాలన్న కుట్రను సాగనీయకూడదు.
ఎటువంటి మినహాయింపులు లేకుండా కార్మిక చట్టాలు అమలు చేయాలి. ఉల్లంఘనలకు కఠిన శిక్షలు విధించాలి.
యజమానులు తమ లాభాలను భారీగా పెంచుకునేందుకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, కాంట్రాక్టు కార్మికుల చట్టం బోనస్‌ చట్టాలను అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారు. ఈ చట్టాలను అమలు చేయించాల్సిన కార్మిక శాఖ యజమానులతో కుమ్మక్కవుతోంది. కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించే ఇనస్పెక్షన్‌కు ప్రభుత్వమే పాతరేసింది. సాధారణ పౌరుడు ఏ కొద్ది తప్పు చేసినా ప్రభుత్వం శిక్షలు వేస్తుంది. కార్మిక చట్టాలు ఉల్లంఘించే యజమానులను మాత్రం యథేచ్ఛగా వదిలి పెడుతుంది. కార్మిక చట్టాలను అమలు చేయమన్న పాపానికి కార్మికులను తప్పుడు కేసుల్లో ఇరికించి శిక్షిస్తుంది.
15 రోజుల్లోపు కార్మిక సంఘాలను తప్పనిసరిగా రిజిస్టరు చేయాలి. సంఘహక్కు, ఉమ్మడి బేరసారాల హక్కులకు సంబంధించిన ఐఎల్‌ఓ తీర్మానాలను ప్రభుత్వం అమోదించాలి.
మనదేశం పేరుకు ప్రపంచంలో ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం. అయినా కార్మిక సంఘాలు రిజిస్టరు కావటం కనాకష్టం. కార్మిక సంఘాలను రిజిస్ట్రేషన్‌కు పెట్టుకుంటే కార్మిక శాఖ యజమానులకు ఉప్పందిస్తుంది. యజమానులు కార్మికులను వేధింపులకు గురిచేస్తారు. తప్పుడు ఆరోపణలతో ఉద్యోగాల నుండి తొలగిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూలేని విధంగా సరళీకరణ విధానాల అమలు కాలంలో సంఘం పెట్టుకోవటం , ఉమ్మడి బేరసాల వంటి ప్రాథమిక హక్కులు కూడా ఘోరంగా నిరాకరించబడుతున్నాయి. ఈ ముఖ్యమైన హక్కుల సంబంధించిన ఐఎల్‌ఓ తీర్మానాలు 87,98, లను కేంద్రయుపిఏ ప్రభుత్వం సాకులు చూపించి ఇంతవరకు అంగీకరించలేదు.
పి అజయ్ కుమార్‌
రాష్ట్ర కార్యదర్శి, సిఐటియు 

8, జూన్ 2012, శుక్రవారం

డబ్బు సంపాదించటం ఎలా ?

డబ్బు తొందరగా సంపాదించటం తప్పా ?

4, జూన్ 2012, సోమవారం



రాష్ట్ర జనాభా వివరాలు

Wed, 20 Jul 2011, IST    vv
హైదరాబాద్‌ (వి.వి.) : రాష్ట్ర జనాభా 8,46,65,533కు చేరింది. ఇందులో గ్రామీణ జనాభా 5,63,11,778 (66.51 శాతం), పట్టణ ప్రాంతాల్లో 2,83,53,745 (33.49శాతం)గా వుంది. మొత్తం జనాభాలో 4,25,09, 881 (50.21శాతం) పురుషులు కాగా, 4,21,55,652 (49.79 శాతం) మహిళలు వున్నారు. తాజాగా జరిగిన జనాభా లెక్కలను బట్టి (2011 సెన్సెస్‌) ఈ వివరాలను ఢిల్లీలోని రిజిస్టార్‌ జనరల్‌, సెన్సెస్‌ కమిషనర్‌ ఈనెల 15వ తేదీన విడుదల చేశారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం నేడు పత్రికలకు అందించింది. దేశ జనాభా 121.02 కోట్లకు చేరింది. ఇందులో గ్రామీణ జనాభా 83.31 కోట్లు (68.84 శాతం) కాగా, పట్టణ ప్రాంతాల జనాభా 37.71 కోట్లు (31.16 శాతం). రాష్ట్రంలో హైదరాబాద్‌ ఒక్కటే పూర్తిస్థాయి అర్బన్‌ జిల్లాగా ఎదిగింది. అనంతరం అత్యధిక జనాభా గల అర్బన్‌ ప్రాంతంగా రంగారెడ్డి 70.32 శాతంతో వుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా అత్యల్పంగా వుంది. ఈ జిల్లాలో కేవలం 15 శాతం మంది మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2001లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీల జనాభా వుండగా, 2011 నాటికి 992కు పెరిగింది. ఆరు సంవత్సరాల లోపు వున్న బాలల సంఖ్య 86,42,686. ఇందులో 58,52,284 మంది గ్రామీణ ప్రాంతాల్లోను, 27,90,402 మంది పట్టణ ప్రాంతాల్లోను వున్నారు. అక్షరాస్యతాశాతం 67.66గా నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 61.14 శాతంగాను, పట్టణ ప్రాంతాల్లో 80.54 శాతంగాను వుంది.